ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువు విషయంలో ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్‌ దాఖలు గడువును ముందుగా 2025 జులై 31గా నిర్దేశించినప్పటికీ, తాజాగా సెప్టెంబర్‌ 15 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం, 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్‌ ఫారాల్లో ఇటీవల చేసిన మార్పుల నేపథ్యంలో తీసుకున్నట్టు వెల్లడించింది. మార్పులకు అనుగుణంగా ఐటీ శాఖ సిస్టమ్‌ను సవరించడానికి కొంత సమయం అవసరమవుతుందనీ, పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిటర్నులు దాఖలు చేయాలన్న ఉద్దేశంతో గడువును పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేస్తామని ఐటీ శాఖ ప్రకటించింది.




Politent News Web4

Politent News Web4

Next Story