UPI : రోజుకు 65 కోట్లకు పైగా లావాదేవీలు..వీసా కంటే దూసుకుపోతున్న యూపీఐ
వీసా కంటే దూసుకుపోతున్న యూపీఐ

UPI : ఇండియాలో తయారుచేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ - UPI) మొదలుపెట్టినప్పుడు.. ఇది వీసా (Visa),మాస్టర్కార్డ్ (MasterCard) వంటి పెద్ద పేమెంట్స్ సర్వీసులను(Payment Services) దాటేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. వీసా , మాస్టర్కార్డ్ సర్వీసులు సుమారు 67 సంవత్సరాల క్రితం మొదలయ్యాయి. కానీ యూపీఐ కేవలం 9 సంవత్సరాలలోనే వాటికి గట్టి పోటీనిచ్చింది. యూపీఐ ఎలా ప్రపంచంలోనే నంబర్ 1 పేమెంట్స్ సిస్టమ్ గా (Payment System) మారబోతుంతో తెలుసకుందాం.
యూపీఐ – వీసాకు గట్టి పోటీ!
జూన్ నెలలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీలను చూస్తే అవి వీసా లావాదేవీల కంటే చాలా ఎక్కువ. 2025 జూన్ 1న యూపీఐ ద్వారా 64.4 కోట్ల లావాదేవీలు జరిగాయి. మరుసటి రోజే ఈ లావాదేవీల సంఖ్య 65 కోట్లను దాటింది. అయితే, 2024 ఆర్థిక సంవత్సరంలో వీసా ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 64 కోట్లు మాత్రమే. అంటే, యూపీఐ కేవలం మూడు రోజుల్లోనే వీసా ఒక సంవత్సరంలో చేసిన లావాదేవీలకు చేరువయ్యింది. 2025 జూన్ మొదటి మూడు రోజుల్లో యూపీఐ ద్వారా సగటున 64.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. యూపీఐ ఈ పెరుగుదలపై 'ఎయిర్పే' వ్యవస్థాపకుడు కునాల్ ఝున్ఝున్వాలా మాట్లాడుతూ..యూపీఐ రోజువారీ లావాదేవీలలో త్వరలోనే వీసాను అధిగమిస్తుందని అన్నారు.
2025లో యూపీఐ ఎలా దూసుకుపోతుంది?
యూపీఐ ఇప్పటికే వీసా కంటే చాలా ముందుంది. ప్రపంచవ్యాప్తంగా వీసా ద్వారా రోజుకు 64 కోట్ల లావాదేవీలు జరుగుతుంటే.. యూపీఐ ద్వారా 2025 జూన్ లో రోజుకు 65 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ లెక్కలు చూస్తుంటే యూపీఐ లావాదేవీల విషయంలో వీసాను దాటిపోయిందని, భవిష్యత్తులో ఇది మరింత పవర్ ఫుల్ పేమెంట్స్ ఆప్షన్ గా మారుతుందని తెలుస్తోంది. నిపుణుల అంచనాల ప్రకారం.. 2029 నాటికి యూపీఐ ద్వారా సంవత్సరానికి 43,900 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. ఇది 2024లో జరిగిన లావాదేవీల కంటే మూడు రెట్లు ఎక్కువ. ప్రస్తుతం భారతదేశంలో 90 శాతం డిజిటల్ లావాదేవీలు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని గమనించాలి.
