7 IPOs Next Week : ఒకటి రెండు కాదు ఏకంగా 7 ఐపీఓలు.. ఇన్వెస్టర్లు గెట్ రెడీ
ఇన్వెస్టర్లు గెట్ రెడీ

7 IPOs Next Week : షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. రాబోయే వారంలో మార్కెట్లోకి ఒకటి, రెండు కాదు, ఏకంగా ఏడు కొత్త ఐపీఓలు రాబోతున్నాయి. ప్రస్తుతం షేర్ మార్కెట్ మంచి ఊపు మీదుంది. పైగా ప్రపంచ రాజకీయ పరిస్థితులు కూడా కొంత స్థిరంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొత్త ఐపీఓలు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. కాబట్టి, డబ్బును పెట్టుబడిగా పెట్టి మంచి రాబడిని పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
జూన్ 30న ప్రారంభమయ్యే ఐపీఓలు
సిల్కీ ఓవర్సీస్ ఐపీఓ: ఈ ఐపీఓ జూన్ 30, 2025న తెరిచి, జూలై 2, 2025న క్లోజ్ అవుతుంది. దీని ద్వారా కంపెనీ దాదాపు రూ.30.68 కోట్లు సేకరించాలని చూస్తోంది. ఒక్కో షేర్ ధర రూ.153 నుంచి రూ.161 మధ్య ఉంది. జూలై 7న ఎన్ఎస్ఈలో ఇది లిస్ట్ అవుతుంది. కంపెనీ లాభాలు కూడా 2023లో రూ.98లక్షల నుంచి 2024లో రూ.5.53 కోట్లకు పెరిగాయి. ఇది మంచి సంకేతం.
సీడార్ టెక్స్టైల్ ఐపీఓ: ఇది కూడా జూన్ 30 నుంచి జూలై 2, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.60.90 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. షేర్ ధర రూ.130 నుంచి రూ.140 మధ్య నిర్ణయించారు. ఇది కూడా జూలై 7న ఎన్ఎస్ఈలో లిస్ట్ కానుంది. 2024లో కంపెనీ ఆదాయం రూ.191.01 కోట్లు, లాభం రూ.11.05 కోట్లుగా నమోదయ్యాయి.
మార్క్ లోయిర్ ఐపీఓ: జూన్ 30 నుంచి జూలై 2, 2025 వరకు ఓపెన్ అయ్యే ఈ ఐపీఓ ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూ. కంపెనీ రూ.21 కోట్లు సేకరించనుంది. ఒక్కో షేర్ ధర రూ.100గా ఉంది. రిటైల్ మరియు HNI పెట్టుబడిదారులకు చెరి 50% కేటాయించారు. ఇది జూలై 7న బీఎస్ఈలో లిస్ట్ అవుతుంది.
పుష్ప జ్యువెలర్స్ ఐపీఓ: జూన్ 30 నుంచి జూలై 2, 2025 వరకు తెరిచి ఉండే ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.98.65 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.74 కోట్లు కొత్త షేర్ల ద్వారా వస్తాయి. షేర్ ధర రూ.143 నుంచి రూ.147 మధ్య ఉంటుంది. జూలై 7న ఎన్ఎస్ఈలో లిస్టింగ్ ఉంటుంది. 2025లో కంపెనీ ఆదాయం రూ.281.27 కోట్లు, లాభం రూ.22.29 కోట్లుగా నమోదయ్యాయి.
వందన్ ఫుడ్స్ ఐపీఓ: ఇది కూడా జూన్ 30 నుంచి జూలై 2 వరకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ రూ.30.36 కోట్లు సేకరిస్తోంది. షేర్ ధర రూ.115గా నిర్ణయించారు. 50% రిటైల్, 50% HNI కోటా ఉంటుంది. జూలై 7న బీఎస్ఈలో లిస్ట్ అవుతుంది.
జూన్ 27న ప్రారంభమయ్యే ఐపీఓ
యాడ్కౌంటీ మీడియా ఇండియా ఐపీఓ: ఈ ఐపీఓ జూన్ 27, 2025న ప్రారంభమై జూలై 1, 2025 వరకు తెరిచి ఉంటుంది. కంపెనీ రూ.50.69 కోట్లు సేకరించాలని చూస్తోంది. షేర్ ధర రూ.80 నుంచి రూ.85 మధ్య ఉంటుంది. జూలై 4న బీఎస్ఈలో లిస్ట్ అవుతుంది. 2025లో కంపెనీ ఆదాయం రూ.69.58 కోట్లు, లాభం రూ.13.75 కోట్లుగా ఉన్నాయి.
