• స్విగ్గీ, జొమాటో సంస్థలకు పోటీ ఇచ్చే అవకాశం
  • జాతీయ హోటళ్ల సమాఖ్య నిబంధనల ప్రకారం ఒప్పందాలు
  • ఈ సమాఖ్యలో 5 లక్షల హోటళ్లు
  • అతి తక్కువ ధరలకే, వేగంగా ఫుడ్ సప్లయ్ లక్ష్యం
  • గతంలోనే ఈబిజినెస్ లోకి ఓలా, ఊబర్ సంస్థలు

ఇన్నాళ్లు ట్రాన్స్ పోర్టుకే పరిమితమైన ర్యాపిడో సంస్థ ఇప్పుడు పుడ్ డెలివరీ మార్కెట్ లోకి కూడా ఎంటరైంది. వివిధ రెస్టారెంట్లతో NRAI (నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నిబంధనలకు లోబడి వాణిజ్యపరమైన ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.ఫుడ్ డెలివరీలో రారాజులుగా రాజ్యమేలుతున్న జుమాటో, స్విగ్గీలకు పోటీగా ర్యాపిడో సంస్థ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీకి రంగం సిద్ధం చేస్తోంది.పోటీలో ఉన్న ఆ రెండు సంస్థలకు భిన్నంగా అతి తక్కువ ధరలకే రెస్టారెంట్లతో ర్యాపిడో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. NRAI లో 5 లక్షల రెస్టారెంట్లు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ పరిణామం చిన్న రెస్టారెంట్లకు ప్రయోజనకరంగా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.జూన్ నెల చివర్లో గానీ, లేదా జులైలో గానీ ర్యాపీడో సంస్థ ఒక డ్రై ట్రయల్ రన్ నిర్వహించే అవకాశాలున్నాయి.ఇచ్చిన ఆర్డర్ వ్యాల్యూని బట్టి రెస్టారెంట్ల దగ్గర 8-15 శాతం కమిషన్ చార్జి చేయనుందని సమాచారం.

అయితే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టినది ర్యాపిడో ఒక్కటే కాదు. ఓలా, ఊబర్ సంస్థలు ఇప్పటికే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగు పెట్టాయి.2015లోనే ఓలా ఓలా కేఫ్ పేరుతో ఫుడ్ బిజినెస్ లోకి దిగింది.అదే ఏడాది ఉబర్ కూడా ఉబర్ ఈట్స్ పేరుతో ఆన్ లైన్ ఫుడ్ ఆర్డరింగ్ డెలివరీ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసింది.అయితే ఆ తర్వాత తన బిజినెస్ ను జొమాటో సంస్థకు అమ్మేసి అందులో 10 శాతం వాటా తీసుకుంది. ర్యాపిడో సంస్థ తన కస్టమర్లకు అతి తక్కువ ధరలకే, వేగంగా, నాణ్యమైన ఫుడ్ డెలివరీ చేస్తామని చెబుతోంది.ఇప్పటి వరకూ ర్యాపిడో సర్వీసులు, బైక్, ఆటో, షేర్ ఆటో, పార్సెల్, క్యాబ్ఎకానమీ, క్యాబ్ ప్రీమియం రవాణా సేవలు అందిస్తోంది.

Politent News Web 1

Politent News Web 1

Next Story