ఆర్బీఐ కొత్త రూల్స్

RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా సేవలు అందిస్తున్న ఆపరేటర్లకు సంబంధించి, భద్రతను పెంచడానికి బ్యాంకులకు కొన్ని కొత్త ఆదేశాలు జారీ చేసింది. దీనితో వేలిముద్ర పెట్టి డబ్బులు తీసేవారిని బ్యాంకింగ్ సిస్టమ్‌లో చేర్చడానికి రూల్స్‌లో మార్పులు రానున్నాయి.

కొత్త నిబంధనల ప్రకారం, అక్వైరింగ్ బ్యాంక్ AePS టచ్‌పాయింట్ ఆపరేటర్లను తమతో చేర్చుకునే ముందు, వారి గురించి సరిగ్గా విచారణ చేయాలని ఆర్బీఐ సూచించింది. ఇది కస్టమర్‌లను చేర్చుకునేటప్పుడు పాటించే విచారణ లాగానే ఉంటుంది. ఒకవేళ ATO లు ఇప్పటికే బిజినెస్ సబ్-ఏజెంట్లుగా విచారణ పూర్తి చేసుకుని ఉంటే, ఆ బ్యాంకు వారికి తనతో కలుపుకోవచ్చు. ఈ కొత్త ఆదేశాలు వచ్చే ఏడాది జనవరి 1 నుండి అమల్లోకి వస్తాయి.

ఒక ATO వరుసగా మూడు నెలల పాటు నిద్రాణంగా ఉంటే, అంటే ఎలాంటి లావాదేవీలు జరపకపోతే, ఆ బ్యాంక్ మళ్ళీ వారికి లావాదేవీలు చేయడానికి అనుమతించే ముందు KYC వెరిఫికేషన్ చేయాలని RBI స్పష్టం చేసింది. RBI ఒక ప్రకటనలో ఇటీవల ఐడెంటిటీ థెఫ్ట్ లేదా కస్టమర్ గుర్తింపును దుర్వినియోగం చేయడం వల్ల AePS ద్వారా మోసాలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాంక్ కస్టమర్‌లను అలాంటి మోసాల నుండి కాపాడటానికి, సిస్టమ్ భద్రతపై నమ్మకాన్ని కాపాడుకోవడానికి AePS ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. చెల్లింపులు, సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007లోని సెక్షన్ 10(2) తో పాటు సెక్షన్ 18 కింద ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ATO లకు సంబంధించిన ఆపరేషనల్ పారామీటర్స్ ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని బ్యాంకింగ్ రెగ్యులేటర్ తెలిపింది.

AePS అనేది గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వారికి చాలా ఉపయోగపడుతుంది. కానీ, దీనిని ఉపయోగించుకుని జరిగే మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్బీఐ తీసుకున్న ఈ కొత్త చర్యలు కచ్చితంగా మోసాలను తగ్గించి, ప్రజల నమ్మకాన్ని పెంచుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story