బట్టల కంటే మందుకే ఎక్కువ ఖర్చు చేస్తున్న భారతీయులు

CMIE Report : దేశంలో సామాన్యులు ఏ వస్తువులపై ఎంత ఖర్చు చేస్తున్నారు? వారి ఖర్చుల తీరు ఎలా ఉంది? అనే విషయాలపై సీఎంఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలోని గణాంకాలు నిజంగా షాకింగ్‌గా ఉన్నాయి. భారతదేశంలోని సామాన్యులు బట్టలు కొనడానికి ఖర్చు చేసే డబ్బు కంటే, మద్యం తాగడానికే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారట. ఇది దేశంలో పెరుగుతున్న వినియోగదారుల అలవాట్లు, ప్రాధాన్యతలలో వస్తున్న మార్పులను స్పష్టంగా చూపిస్తుంది.

2023-24లో ఖర్చుల తీరు

సీఎంఐఈ నివేదిక ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రజలు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని దుస్తుల కొనుగోలుకు కాకుండా మద్యం కొనుగోలుకు ఖర్చు చేశారు. 2023-24లో భారతీయులు దుస్తులపై రూ. 7.29 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇదే కాలంలో ఆల్కహాలిక్ డ్రింక్స్‌పై రూ. 1.20 లక్షల కోట్లు ఖర్చు చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే, దుస్తులపై ఖర్చు తగ్గింది. కానీ మద్యంపై ఖర్చు మాత్రం బాగా పెరిగింది.

గత సంవత్సరం (2022-23) దుస్తులపై ఖర్చు రూ. 7.60 లక్షల కోట్లు. ఇది 2023-24లో రూ. 7.29 లక్షల కోట్లకు తగ్గింది. అంటే దాదాపు రూ. 31 వేల కోట్లు తగ్గింది. అంతకు ముందు సంవత్సరం (2022-23) మద్యంపై ఖర్చు రూ. 0.95 లక్షల కోట్లు. ఇది 2023-24లో రూ. 1.20 లక్షల కోట్లకు పెరిగింది. అంటే సుమారు 26శాతం పెరిగింది. ఈ గణాంకాలు దుస్తులు కొనుగోలుకు ప్రాధాన్యత తగ్గించి, మద్యం వినియోగం పెరుగుతోందని స్పష్టం చేస్తున్నాయి.

సీఎంఐఈ నివేదిక ప్రకారం, ప్రజలు కొన్ని నిత్యావసరాలపై గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎక్కువ ఖర్చు చేశారు. ధాన్యాలు, పప్పులు, పాలు, గుడ్లు, జున్ను, పండ్లు, కూరగాయలు వంటి వాటిపై ఖర్చు పెరిగింది. ఇది ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారని సూచిస్తుంది.

చాక్లెట్లు, చక్కెర, జామ్ వంటి వస్తువులపై కూడా ఖర్చు 19.78శాతం పెరిగింది. ఆరోగ్యం పై కూడా ఖర్చు 18.75శాతం పెరిగింది. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నారని దీని ద్వారా తెలుస్తుంది. మొత్తంగా, వినియోగదారుల ఖర్చు ఒక సంవత్సరంలో 9.72శాతం పెరిగి, మొత్తం రూ. 181.4 లక్షల కోట్లకు చేరుకుంది.

కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. ప్రజలు కొన్ని రంగాల్లో ఖర్చులను తగ్గించుకున్నారు. నూనెలు కొవ్వు పదార్థాల పై ఖర్చు 19.67శాతం తగ్గింది. ఇది ప్రజలు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకుని, కొవ్వు పదార్థాల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారని సూచించవచ్చు. ఆరోగ్యంపై ఖర్చు పెరిగినప్పటికీ, బీమా ప్రీమియంపై ఖర్చు గత సంవత్సరంతో పోలిస్తే 3.39శాతం తగ్గింది. ఇది ఆర్థిక ప్రణాళికలో కొంత జాగ్రత్త తగ్గుతుందోమో అని సూచించవచ్చు. ఇంటర్నెట్ కమ్యూనికేషన్పై ఖర్చు 8శాతం పెరిగింది. ఇది డిజిటల్ వినియోగం పెరుగుదలను చూపిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ పై ఖర్చులో మాత్రం 1.38శాతం తగ్గుదల కనిపించింది.

ఈ సీఎంఐఈ నివేదిక భారతదేశంలోని ప్రజల ఖర్చుల తీరులో వస్తున్న ముఖ్యమైన మార్పులను స్పష్టం చేస్తుంది. నిత్యావసరాలపై ఖర్చు పెరిగినప్పటికీ, విలాసాలైన మద్యంపై అధిక వ్యయం, దుస్తుల వంటి వాటిపై ఖర్చు తగ్గడం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ మార్పులు దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, ప్రజల ఆర్థిక ప్రాధాన్యతలలో వస్తున్న మార్పులను ప్రతిబింబిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story