రైల్వేలో విప్లవాత్మక మార్పులు

Indian Railways : భారతీయ రైల్వే డిజిటల్ టికెట్ బుకింగ్ రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. 2025, మే 22న కేవలం ఒకే నిమిషంలో 31,814 టికెట్లు బుక్ అయ్యాయి. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద రికార్డు. అంతేకాకుండా, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి రైల్వే శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 2.5 కోట్ల నకిలీ యూజర్ ఐడీలను గుర్తించి వాటిని డీయాక్టివేట్ చేసింది. దీనితో సాధారణ ప్రయాణికులకు తత్కాల్ టికెట్లు దొరికే అవకాశం మరింత పెరిగింది.

రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. రైల్వే తన టికెట్ బుకింగ్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్‌గా ఆధునీకరించింది అని తెలిపారు. ఇప్పుడు వెబ్‌సైట్‌లో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత యాంటీ-బాట్ సిస్టమ్ (AI-based Anti-Bot System) ను అమర్చారు. ఇది నకిలీ, ఆటోమేటిక్ బుకింగ్‌లను చేసే 'బాట్స్‌' (Bots)ను తక్షణమే గుర్తించి బ్లాక్ చేస్తుంది.

టికెట్ బుకింగ్ ప్రక్రియలో అత్యంత సవాలుతో కూడుకున్న 'తత్కాల్ టికెట్ బుకింగ్'ను ఇప్పుడు మరింత సులభతరం చేశారు. గతంలో తత్కాల్ బుకింగ్‌లో దాదాపు 50శాతం లాగిన్‌లు 'బాట్‌ల' ద్వారా ఐదు నిమిషాల్లో జరిగేవని అంచనా. ఇప్పుడు ఈ సమస్య పూర్తిగా తొలగిపోయింది. దీని వల్ల నిజమైన ప్రయాణికులకు టికెట్ బుక్ చేసుకోవడంలో జాప్యం జరగడం లేదు.. అలాగే ఏజెంట్ల జోక్యం లేకుండా టికెట్లు లభిస్తున్నాయి.

టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి, అక్రమ మార్గాల్లో బుకింగ్‌లు చేసే వారిపై రైల్వే శాఖ పెద్ద చర్య తీసుకుంది. దాదాపు రెండున్నర కోట్ల నకిలీ యూజర్ ఖాతాలను మూసివేసింది. ఈ ఐడీలను నిబంధనలను ఉల్లంఘిస్తున్న వ్యక్తులు లేదా ఏజెంట్లు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు, కేవలం ధృవీకరించబడిన, నిజమైన యూజర్లకు మాత్రమే టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.

రైల్వే శాఖ కొత్త మార్గదర్శకాలను కూడా అమలు చేసింది

ఆధార్ వెరిఫికేషన్ లేని యూజర్లు: ఆధార్ వెరిఫికేషన్ (Aadhaar Verification) లేని యూజర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న మూడు రోజుల తర్వాతే తత్కాల్, ప్రీమియం తత్కాల్ (Premium Tatkal) లేదా అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) టికెట్లను బుక్ చేసుకోగలరు.

ఆధార్ వెరిఫికేషన్ ఉన్న యూజర్లు: ఆధార్‌తో వెరిఫై అయిన యూజర్లు ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

రోజువారీ లాగిన్ అయ్యే వారి సంఖ్య: ఆర్థిక సంవత్సరం 2023-24లో 69.08 లక్షల నుండి ఆర్థిక సంవత్సరం 2024-25లో 82.57 లక్షలకు పెరిగింది (దాదాపు 19.53% పెరుగుదల).

రోజువారీ టికెట్ బుకింగ్‌లు: రోజువారీ టికెట్ బుకింగ్‌లలో 11.85% పెరుగుదల నమోదైంది.

ఆన్‌లైన్ బుకింగ్‌లు: మొత్తం రిజర్వ్ చేయబడిన టికెట్లలో 86.38% ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే బుక్ అవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story