ఇజ్రాయిల్‌ స్టాక్ ఎక్స్ఛేంజ్‌పై ఇరాన్ క్షిపణి దాడి

Iran Missile Attack : మిడిల్ ఈస్ట్‎లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం పతాక స్థాయికి చేరింది. ఇరాన్, ఇజ్రాయిల్‌పై క్షిపణులతో దాడి చేయడంతో టెల్ అవీవ్‌లోని ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ భారీగా దెబ్బతింది. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. బుధవారం ఇరాన్ ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ నగరంపై 25కి పైగా క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణుల దాడిలో ఇజ్రాయిల్ ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (TASE.TA) భవనం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ భవనం దెబ్బతినడం ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.

క్షిపణి దాడి తర్వాత టెల్ అవీవ్ నగరమంతా భయానక వాతావరణం నెలకొందని స్థానికులు తెలిపారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనం నుంచి దట్టమైన పొగలు వెలువడుతూ కనిపించాయి. భవనంలోని చాలా భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో ఎంత నష్టం జరిగిందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ దాడి ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గత కొంతకాలంగా మంచి పనితీరు కనబరుస్తోంది. గత నెలలో 3.24 శాతం పెరిగింది. ఆరు నెలల్లో 40 శాతానికి పైగా వృద్ధి సాధించింది. కానీ ఈ దాడితో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం కొనసాగితే ఇజ్రాయిల్ స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. క్షిపణి దాడుల ప్రభావం స్టాక్ ఎక్స్ఛేంజ్‌కే పరిమితం కాలేదు. ఇరాన్ ప్రయోగించిన ఒక క్షిపణి టెల్ అవీవ్‌లోని ఒక ఆసుపత్రిని కూడా తాకిందని అల్ జజీరా తెలిపింది. ఈ దాడిలో చాలా మంది గాయపడ్డారు. ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గాయపడిన వారిని వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించారు. కానీ దాడి తీవ్రత కారణంగా సహాయక చర్యల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఇరాన్ దాడుల తర్వాత ఇజ్రాయిల్ కూడా ప్రతీకారం తీర్చుకుంది. ఇజ్రాయిల్ ఇరాన్‌లోని అనేక స్థావరాలపై వైమానిక, క్షిపణి దాడులు చేసింది. వీటిలో ఇరాన్ అణు స్థావరాలు కూడా ఉన్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక శక్తికి భారీ నష్టం వాటిల్లిందని ఇజ్రాయిల్ పేర్కొంది. గత వారం రోజుల్లో ఇజ్రాయిల్ ఇరాన్‌పై అనేక పెద్ద ఆపరేషన్లు నిర్వహించింది. ఈ దాడుల్లో ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్లు మరణించారు. వందలాది మంది ప్రజలు గాయపడ్డారు

PolitEnt Media

PolitEnt Media

Next Story