PM-KISAN : పీఎం కిసాన్ 20విడుత డబ్బులు ఎప్పుడు వేస్తారు ? ఈ సారి ఎంత మందికి డబ్బులు అందుతాయి ?
ఈ సారి పీఎం కిసాన్ 20విడుత డబ్బులు ఎంత మందికి అందుతాయి ?

PM-KISAN : భారత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన కీలక పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) ఒకటి. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, గ్రామీణ ఆదాయాన్ని స్థిరీకరించడం లక్ష్యంగా రూపొందించిన ఈ పథకం. రైతులకు ఆర్థిక సహాయం అందించి, సాగు ఖర్చులను తీర్చడంలో, మెరుగైన వ్యవసాయ పద్ధతులు అవలంబించడంలో సహాయపడుతుంది. పీఎం-కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున, సంవత్సరానికి మొత్తం రూ.6,000 మూడు సమాన వాయిదాలలో అందిస్తుంది. ఈ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) సిస్టమ్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద DBT పథకం!
2019లో ప్రారంభమైనప్పటి నుండి, పీఎం-కిసాన్ పథకం పరిమాణం, విస్తరణ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లలో ఒకటిగా నిలిచింది. ఈ పథకం ఇప్పటికే 19 వాయిదాలను పూర్తి చేసుకుంది. ఇటీవల 19వ విడతను 2025 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీని ద్వారా 2.4 కోట్ల మంది మహిళా లబ్ధిదారులతో సహా 9.8 కోట్ల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరింది. అంతకు ముందు 18వ విడత 2024 అక్టోబర్లో, 17వ విడత 2024 జూన్లో విడుదలయ్యాయి.
20వ విడత ఎప్పుడు వస్తుంది?
ఫిబ్రవరిలో 19వ విడత విడుదలైన నేపథ్యంలో 20వ విడత 2025 జూన్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఖచ్చితమైన విడుదల తేదీ, స్థలంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ ప్రధానమంత్రి మోదీ మళ్ళీ ఈ పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని అంచనా వేస్తున్నారు.
పీఎం-కిసాన్ పథకం అంటే ఏమిటి? ఎవరు అర్హులు?
అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ 2019 మధ్యంతర బడ్జెట్లో పీఎం-కిసాన్ పథకాన్ని ప్రకటించారు. ఇది చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6,000 మూడు సమాన వాయిదాలలో విడుదల చేస్తారు.
మొదటి విడత: ఏప్రిల్-జులై మధ్య
రెండో విడత: ఆగస్టు-నవంబర్ మధ్య
మూడో, చివరి విడత: డిసెంబర్-మార్చి మధ్య
ఈ ఆర్థిక సహాయం రైతులకు పంట ఖర్చులను నిర్వహించడానికి, ఉత్పాదకతను పెంచడానికి పెట్టుబడి పెట్టడానికి, అనధికారిక రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
పీఎం-కిసాన్ పథకానికి ఎవరు అర్హులు?
* భారతదేశ పౌరుడై ఉండాలి.
* సాగు చేయదగిన వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి.
* చిన్న లేదా సన్నకారు రైతు అయి ఉండాలి.
* నెలకు రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్నవారు అర్హులు కారు.
* గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను దాఖలు చేయనివారై ఉండాలి.
* సంస్థాగత భూ యజమానులు అర్హులు కారు.
ఈ అర్హత ప్రమాణాలకు మించి ఉన్న రైతులను పథకం నుండి మినహాయించారు. తద్వారా లక్షిత లబ్ధిదారులకు ప్రయోజనం అందుతుంది.
ఈ-కేవైసీ తప్పనిసరి – ఎలా పూర్తి చేయాలి?
* అధికారిక పీఎం-కిసాన్ పోర్టల్ ప్రకారం, పీఎం-కిసాన్ కింద నమోదు చేసుకున్న రైతులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి. రైతులు ఈ-కేవైసీ ప్రక్రియను రెండు మార్గాల్లో పూర్తి చేయవచ్చు:
* అధికారిక పీఎం-కిసాన్ పోర్టల్ ద్వారా: OTP ఆధారిత ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు.
* దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) వద్ద: బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు.
మీ పీఎం-కిసాన్ లబ్ధి స్థితిని ఎలా తనిఖీ చేయాలి?
* https://pmkisan.gov.in/ వెబ్సైట్ను సందర్శించండి.
* Know Your Status అనే లింక్పై క్లిక్ చేయండి.
* మీ రిజిస్ట్రేషన్ నంబర్ను నమోదు చేయండి, క్యాప్చాను ఎంటర్ చేయాలి. Get Data పై క్లిక్ చేయండి.
* మీ ప్రస్తుత లబ్ధిదారుల స్థితి కనిపిస్తుంది.
పీఎం-కిసాన్ లబ్ధిదారుల జాబితాను ఎలా చూడాలి?
* https://pmkisan.gov.in/ వెబ్సైట్ను సందర్శించండి.
* Beneficiary List పై క్లిక్ చేయండి.
* మీ రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్ మరియు గ్రామాన్ని ఎంచుకోండి.
* పూర్తి జాబితాను చూడటానికి Get Report పై క్లిక్ చేయండి.
పీఎం-కిసాన్ కోసం ఎలా నమోదు చేసుకోవాలి?
* https://pmkisan.gov.in వెబ్సైట్ను సందర్శించండి.
* New Farmer Registration పై క్లిక్ చేయండి.
* మీ ఆధార్ నంబర్, క్యాప్చాను నమోదు చేయండి.
* అవసరమైన వివరాలను నింపి Yes పై క్లిక్ చేయండి.
* రిజిస్ట్రేషన్ ఫారమ్ను పూర్తి చేసి సబ్మిట్ చేయండి.
* భవిష్యత్ అవసరాల కోసం దాని ప్రింటవుట్ తీసుకోండి.
