పాపరాజీల కెమెరా కు చిక్కిన రష్మిక.. విజయ్ దేవరకొండ

ముంబై ఎయిర్పోర్ట్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి ఒకే వాహనంలో బయల్దేరుతుండగా ఫోటోగ్రాఫర్స్, మీడియా కెమెరాలకు చిక్కారు. జూన్ 17 రాత్రి జరిగిన ఈ సంఘటనలో రష్మిక విమానం నుంచి దిగి కారులోకి ఎక్కగా, విజయ్ ఇప్పటికే కారులో ఉన్నాడని తెలుస్తోంది. ఇద్దరూ ముఖాలకు మాస్క్లు ధరించి, కెమెరాలకు దొరకకుండా ప్రయత్నించినప్పటికీ, పాపరాజీ వారిని క్లిక్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.విజయ్, రష్మికల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ రూమర్స్ జోరుగా సాగుతున్నాయి. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఫ్యాన్స్ను ఫిదా చేసింది. 2024లో ఇద్దరూ సంబంధంలో ఉన్నామని చెప్పినప్పటికీ, ఒకరి పేర్లను ఒకరు బయటపెట్టలేదు. ముంబై ఎయిర్పోర్ట్లో తాజాగా కనిపించిన ఈ సంఘటన మరోసారి వారి రిలేషన్షిప్ గురించి చర్చలు రేగేలా చేసింది. ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ, విజయ్ రష్మికను పికప్ చేయడానికి వచ్చాడని, ఇది ట్రూ లవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఈ జంట ఫోటోలు, వీడియోలు చూసిన ఫ్యాన్స్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. "విజయ్-రష్మిక బెస్ట్ జోడీ" అంటూ హ్యాష్ట్యాగ్లతో పోస్టులు పెడుతున్నారు. రష్మిక తన రాబోయే చిత్రం 'కుబేరా' ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉండగా, విజయ్ కూడా అక్కడే ఉన్నాడని తెలుస్తోంది. ఈ జంట కలిసి ఉన్న ప్రతిసారీ ఫ్యాన్స్లో ఉత్సాహం రెట్టింపవుతోంది. కొందరు వీరు త్వరలో తమ రిలేషన్షిప్ను అధికారికంగా ప్రకటిస్తారని ఆశిస్తున్నారు
