బడా యాక్షన్ మూవీ!

CInema:బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమిర్ ఖానే స్వయంగా వెల్లడించాడు. ఇది ఒక పెద్ద యాక్షన్ సినిమా అని ఇది వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం అవుతుందని వెల్లడించాడు. కనగరాజ్ తమిళ సినిమాలో మంచి అభిరుచి గల దర్శకుడు, కమల్ హాసన్ నటించిన విక్రమ్, లియో, విజయ్ తో మాస్టర్, కార్తీ నటించిన ఖైదీ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో అమిర్ ఖాన్ ఓ ఒక అతిధి పాత్రలో కనిపిస్తున్నారు. కాగా 2014లో తాను నటించిన కామెడీ డ్రామా "పీకే"కి సీక్వెల్ రానుందన్న వార్తలను ఆమిర్ తోసిపుచ్చారు. అయితే పీకే దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో కలిసి నటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం సితారే జమీన్‌ పర్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. బాస్కెట్‌బాల్‌ కోచ్‌ అయిన గుల్షన్‌ (ఆమిర్‌ఖాన్‌) మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న కొంతమందిని ప్లేయర్స్‌గా తీర్చిదిద్దాల్సి వస్తుంది? మరి గుల్షన్‌ వాళ్లకు ఎలా శిక్షణ ఇచ్చాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? అన్నది ‘సితారే జమీన్‌ పర్‌’ కథ. జూన్‌ 20న రిలీజ్ కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story