Telugu Cinema:గ్రాండ్ గా అఖిల్ పెండ్లి... ఎవరీ జైనాబ్ రాజీ?
ఎవరీ జైనాబ్ రాజీ?

Telugu Cinema:కింగ్ నాగార్జున తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఇవాళ తెల్లవారుజామున జూబ్లీహిల్స్లోని నివాసంలో తన ప్రేయసి జైనాబ్ రాజీని పెండ్లి చేసుకున్నాడు. నాగార్జున, అమల, నాగచైతన్య, శోభిత దంపతులు దగ్గరుండి మ్యారేజ్ జరిపించారు. ఈవేడుకకు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు, చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, నటుడు శర్వానంద్, రాజమౌళి తనయుడు కార్తికేయ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటు పలువురు సినీప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన పిక్స్, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఈనెల 8న రిసెప్షన్ ఏర్పాటుచేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనున్న ఈ వివాహ విందులకు సినీ, రాజకీయ ప్రముఖలు హాజరుకానున్నారు. కాగా .. గతేడాది నవంబర్ 26న అఖిల్, జైనబ్ ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. జైనాబ్ రాజీ హైదరాబాదీలే. అయితే ఆమె కుటుంబానికి ఎలాంటి రాజకీయ, వ్యాపార లింకులు ఉన్నాయి. ఇక ఆమె తండ్రి జుల్ఫీ రావడ్జీ జగన్ సీఎంలగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వంలో సలహాదారుగా పని చేశారు. కేబినెట్ ర్యాంక్తో ఆయన కీలకంగా వ్యవహరించినట్లుగా సమాచారం. జుల్ఫీ రావడ్జీ కుటుంబానికి ZR ఇన్ ఫ్రా పేరుతో కంపెనీ ఉంది. జైనాబ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోందట. ఇన్ స్టాలో ఈమెకు ఖాతా ఉంది గానీ అది ప్రైవేట్లో ఉంది. అఖిల్ ఈమెని చాలా ఏళ్లుగా ప్రేమించాడని చెప్పారు
