Actress Rukmini Vasanth: నా బికినీ ఫోటోలు అన్నీ ఫేక్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి రుక్మిణి వసంత్..
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి రుక్మిణి వసంత్..

Actress Rukmini Vasanth: సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరైన నటి రుక్మిణి వసంత్ తాజాగా ఒక పెద్ద సైబర్ వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న కొన్ని అభ్యంతరకర బికినీ చిత్రాలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఆ ఫోటోలు పూర్తిగా నకిలీవని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిన డీప్ఫేక్ చిత్రాలని ఆమె స్పష్టం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.
గందరగోళానికి గురిచేసిన నకిలీ ఫోటోలు:
గత కొన్ని రోజులుగా, గ్రీన్ కలర్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తున్నట్లుగా ఉన్న ఆమె ఫోటోలు, చిన్న చిన్న వీడియో క్లిప్లు ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. చాలామంది నెటిజన్లు ఇది నటి రుక్మిణి వసంత్ చేసిన మొదటి బికినీ షూట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఉదంతంపై రుక్మిణి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందిస్తూ అసలు నిజాన్ని బయటపెట్టారు.
రుక్మిణి వసంత్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్
"నా పేరుతో ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్న కొన్ని ఏఐ-జనరేటెడ్ చిత్రాలు నా బృందం దృష్టికి వచ్చాయి. ఆ చిత్రాలు పూర్తిగా ఫేక్, కల్పితమైనవి అని నేను ఇక్కడే స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఆ ఫోటోలకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. సాంకేతికతను వాడుకుని ఇలాంటి నకిలీ కంటెంట్ను సృష్టించడం, దానిని వ్యాప్తి చేయడం అత్యంత బాధ్యతారాహిత్యం. ఇది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత గోప్యతా హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే" అని రుక్మిణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సైబర్ క్రైమ్ యాక్షన్:
ఇటువంటి ఫేక్ చిత్రాలను రూపొందించిన వారితో పాటు వాటిని కావాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రచారం చేసిన వారిని కూడా వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు. తన లీగల్ టీమ్, పీఆర్ బృందం ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి, చట్టపరమైన చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని, నకిలీ ఫోటోలను ఎవరూ నమ్మవద్దని.. ఆ కంటెంట్ను ఫార్వార్డ్ చేయకుండా డిలీట్ చేయాలని ఆమె ప్రజలకు, నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.

