మరో విషాదం

Kota Srinivasa Rao’s Family: నటుడు కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆమె వయస్సు 75 సంవత్సరాలు. ఈ మరణం కోట శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం నింపింది.

కోట శ్రీనివాసరావు జూలై 13న మరణించిన తర్వాత, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆయన భార్య రుక్మిణి కూడా మరణించడం సినీ పరిశ్రమలో విషాదాన్ని కలిగించింది. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఈ వార్త తెలిసి తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు, అభిమానులు తమ సంతాపం తెలియజేశారు. కోట శ్రీనివాసరావు రుక్మిణిని వివాహం చేసుకున్నారు. వారి వివాహం 1966లో జరిగింది. ఆయన తన కుటుంబ జీవితాన్ని మీడియాకు దూరంగా ఉంచడానికి ఇష్టపడేవారు.

కోట శ్రీనివాసరావ, రుక్మిణి దంపతులకు ముగ్గురు సంతానం - ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్. అతడు తన తండ్రి అడుగుజాడల్లో నటుడిగా మారారు. అయితే, 2010లో ఒక రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఈ విషాదం కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు పల్లవి శ్రీనివాసరావు, పావని శ్రీనివాసరావు. వారిద్దరికీ వివాహాలు జరిగాయి. పిల్లలు కూడా ఉన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story