Ashu Reddy: ఇన్స్టాగ్రామ్లో అషు రెడ్డి కొత్త బిజినెస్; ఒక్క రోజులోనే వందల మంది సబ్స్క్రైబర్స్!
ఒక్క రోజులోనే వందల మంది సబ్స్క్రైబర్స్!

Ashu Reddy: సోషల్ మీడియా సెలబ్రిటీ, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ప్రస్తుతం సరికొత్త ట్రెండ్ను ఫాలో అవుతూ తన ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. ఇన్స్టాగ్రామ్లో తనకున్న భారీ ఫాలోయింగ్ను క్యాష్ చేసుకునేందుకు ఆమె 'సబ్స్క్రిప్షన్' ఫీచర్ను ప్రారంభించారు. తన ఎక్స్క్లూజివ్ కంటెంట్ను చూడాలనుకునే అభిమానుల కోసం నెలకు 399 రూపాయల సబ్స్క్రిప్షన్ ఫీజును నిర్ణయించారు. ఈ ఫీజు చెల్లించిన వారికి మాత్రమే ఆమె తన ప్రత్యేకమైన ఫోటోలు, వీడియోలు మరియు పర్సనల్ అప్డేట్స్ను అందుబాటులో ఉంచుతారు.
ఇప్పటికే టాలీవుడ్ నటీమణులు విష్ణుప్రియ భీమనేని, అనన్యా నాగళ్ల వంటి వారు ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ను ప్రారంభించి సక్సెస్ కాగా, ఇప్పుడు ఆ జాబితాలో అషు రెడ్డి కూడా చేరిపోయారు. ఇన్స్టాగ్రామ్లో 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న అషు రెడ్డికి ఈ ఫీచర్ ప్రారంభించిన మొదటి రోజునే అనూహ్య స్పందన లభించింది. రిపోర్టుల ప్రకారం, కేవలం ఒక్క రోజులోనే దాదాపు 700 మందికి పైగా ఆమె సబ్స్క్రిప్షన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే, నెలకు కేవలం ఈ సబ్స్క్రిప్షన్ల ద్వారానే ఆమెకు దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
నిజానికి అషు రెడ్డి కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, ఆమెకు సోషల్ మీడియా ద్వారానే విపరీతమైన క్రేజ్ లభించింది. ముఖ్యంగా తన గ్లామరస్ ఫోటోషూట్లు మరియు బోల్డ్ స్టేట్మెంట్లతో ఎప్పుడూ వార్తల్లో ఉండే అషు రెడ్డి, ఇప్పుడు అదే క్రేజ్తో డిజిటల్ ప్లాట్ఫామ్లో కాసుల వర్షం కురిపిస్తున్నారు. సినిమాల కంటే కూడా సోషల్ మీడియా కంటెంట్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల సరసన ఆమె నిలిచారు.

