బార్డర్ 2 షూటింగ్ ప్రారంభం – పుణే ఎన్డీఏలో బాలీవుడ్ హీరోలు
Border 2 shooting begins – Bollywood heroes at Pune NDA

పాట్రియాటిజం నేపథ్యంగా తెరకెక్కనున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా బార్డర్ 2 షూటింగ్ మూడో షెడ్యూల్ పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సన్నీ డియోల్, వరుణ్ ధవన్లతో పాటు తాజాగా దిల్జీత్ దోసాంఝ్, అహాన్ శెట్టి కూడా బార్డర్ 2 టీమ్లో చేరారు.
దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన భారత సైనికుల వీరత్వాన్ని మరోసారి వెండితెరపై చూపించేందుకు నిర్మాత భూషణ్ కుమార్, నిధి దత్త, సహనిర్మాత శివ్ చనానా, దర్శకుడు అనురాగ్ సింగ్, బినోయ్ గాంధీ తదితరుల నేతృత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బార్డర్ 2 సినిమా భారత జవాన్ల ధైర్యసాహసాల గాథను తెరపైకి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నం. బాలీవుడ్ టాప్ స్టార్ కాస్ట్, అద్భుతమైన సాంకేతిక బృందంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు దేశభక్తి, సైనికుల త్యాగం, సంఘీభావాన్ని ఎంతో ప్రభావవంతంగా తెరకెక్కించనుంది.
ఈ సినిమాను గుల్షన్ కుమార్, టీ సిరీస్ సమర్పణలో, జేపీ దత్తాకు చెందిన జేపీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. నిర్మాణ బృందంలో భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్త ఉన్నారు. 1997లో విడుదలైన క్లాసిక్ "బార్డర్"కు సీక్వెల్గా బార్డర్ 2 రూపొందుతోంది. ఈ సారి కథ మరింత విశాలంగా ఉండనుందని సినీ వర్గాల అంచనా.
