చాలా దారుణం.. రష్మిక ఆవేదన

RashmikaMandanna: నేషనల్ క్రష్ రష్మిక.. తన వృత్తిపరమైన జీవితంలో ఎదుర్కొంటున్న ఓ కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తెల్లవారుజామున చేసే విమాన ప్రయాణాలు తనను ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయన్న విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించారు. ఈ ప్రయాణాలు అత్యంత దారుణంగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఉదయం 3:50 గంటలకు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీలోంచి తీసిన ఒక ఫొటోను రష్మిక షేర్ చేశారు. "ఉదయం 3:50 గంటల ఫ్లైట్లు చాలా దారుణంగా ఉంటాయి. అది పగలో, రాత్రో కూడా అర్థం కాదు" అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. అయితే తన ప్రయాణ గమ్యం గురించిన వివరాలను ఆమె వెల్లడించలేదు.

"రెండు గంటలు నిద్రపోయి లేచి పని మొదలుపెట్టాలా? అలా చేస్తే రోజంతా నీరసంగా ఉంటుంది. లేదంటే, అసలు నిద్రపోకుండా రోజంతా పనిచేసి ఆ తర్వాత నిద్రపోవాలా? అలా చేసినా నీరసంగానే ఉంటుంది. రోజూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడమే నాకు చాలా కష్టంగా అనిపిస్తోంది" అని రష్మిక ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక ప్రస్తుతం పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో తొలిసారిగా ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'థమా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పురాతన గ్రంథాల్లోని వాస్తవాలను శోధిస్తూ, స్థానిక వాంపైర్ల కథల వెనుక ఉన్న రహస్యాలను ఛేదించే ఒక చరిత్రకారుడి కథ ఇది. 'ముంజ్యా' ఫేమ్ ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

దీంతో పాటు తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్‌ఫ్రెండ్' అనే చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. "ఇది నాకు చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్. మీరందరూ దీన్ని ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను" అని రష్మిక గతంలో తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story