ఆ పరమేశ్వరుడే చూసుకుటాడు : రచయిత ఆవేదన

Kannappa Movie: కన్నప్ప సినిమాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఆ సినిమా మాటల రచయిత ఆకెళ్ళ శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. తాను బ్రాహ్మణుడినని, ఈ మూవీకి దర్శకత్వం వహించిన ముఖేశ్ కుమార్ సింగ్ కూడా ఉత్తర భారత దేశానికి చెందిన బ్రాహ్మణుడేనని చెప్పుకొచ్చారు. ముఖేశ్ కుమార్ సింగ్ టీవీ సీరియల్ మహా భారతాన్ని అత్యద్భుతంగా తీసిన దర్శకుడని అన్నారు. కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులని గానీ, ఏ ఇతర కులాల వారిని గానీ కించపరచలేదన్నారు.‘ఇదివరకు కన్నప్ప చరిత్ర మీద వచ్చిన చిత్రాలలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటించిన 'శ్రీ కాళహస్తి మహత్యం, కృష్ణంరాజు నటించిన 'భక్త కన్నప్ప' చిత్రాల లో గుడిలో ప్రధాన పూజారి మహదేవ శాస్త్రి పాత్రను (మొదటి చిత్రంలో ముదిగొండ లింగమూర్తి, రెండవ దాంట్లో రావుగోపాల రావు పోషించారు). గుడిలో దేవుడి నగలు తీసుకెళ్లి తన ఉంపుడుగత్తెకు ఇచ్చినట్టుగా చూపించారు. కానీ కన్నప్ప చిత్రంలో కథానాయకుడిగా నటించడమే గాక, కథా రచన చేసిన మంచు విష్ణు ధూర్జటి 16వ శతాబ్దం లో రచించిన శ్రీ కాళహస్తీ మహత్యం గ్రంథం ఆధారంగా, మోహన్ బాబు పోషించిన మహదేవ శాస్త్రి పాత్రని మహా శివ భక్తుడి పాత్రగా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు. సినిమా చూశాక, ప్రేక్షకులందరికీ ఆ విషయం అర్థమవుతుంది. ఈ చిత్ర కథని రాస్తున్నప్పుడే కాకుండా, చిత్రాన్ని పూర్తి చేశాక కూడా పరమ పవిత్రమైన శ్రీ కాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులకి చూపించారు. వారు చిత్రం ఎంతో ఉన్నతంగా వుందని ప్రశంసించి, మోహన్ బాబు, విష్ణుని వేదమంత్రాలతో ఆశీర్వదిం చారు.' అని అన్నారు. కన్నప్ప చిత్రం ఇంకా విడుదల కాకుండానే ఏవేవో వదంతులు పుట్టించి, దుష్ప్రచారం చేస్తున్న వారి విషయం ఆ పరమేశ్వరుడే చూసుకుటాడు' అని లేఖలో పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story