Emotional Post by Ex-Wife Shyamali: 'సానుభూతి చూపొద్దు': మాజీ భార్య శ్యామాలి ఎమోషనల్ పోస్ట్!
మాజీ భార్య శ్యామాలి ఎమోషనల్ పోస్ట్!

Emotional Post by Ex-Wife Shyamali: ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు తన మాజీ భార్య శ్యామాలి.. నటి సమంతను వివాహం చేసుకున్న నేపథ్యంలో, తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చపై ఇన్స్టాగ్రామ్ వేదికగా ఘాటుగా స్పందించారు. తాను ఎవరి సానుభూతి కోసం పాకులాడటం లేదని, అలాగే ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వబోనని శ్యామాలి స్పష్టం చేశారు. ఈ వివాహం కారణంగా తనపై జాలి చూపిస్తున్నారని, అయితే తాను ప్రస్తుతం వాటిని పట్టించుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.
శ్యామాలి ప్రస్తుతం తన బాధకు కారణం తన మాజీ భర్త వివాహం కాదని, మరో వ్యక్తిగత అంశమని వెల్లడించారు. "నాపై ప్రేమాభిమానాలు చూపుతున్న అందరికీ కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదాలు నాకు అందుతున్నాయి. కానీ, నేను ప్రస్తుతం ఎలాంటి విషయాల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే, నా గురువు క్యాన్సర్ బారిన పడినట్లు ఇటీవల తెలిసింది. నేను ఆయన కోసం ప్రార్థిస్తున్నాను. ఆ కారణంగానే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నా," అని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మీడియాకు విజ్ఞప్తి చేస్తూ, తన నుంచి ఎలాంటి 'బ్రేకింగ్ న్యూస్లు' లేదా 'ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు' ఆశించవద్దని శ్యామాలి కోరారు. "నాకు ఎలాంటి పీఆర్ టీమ్ లేదు. నా సోషల్ మీడియా ఖాతాలను నేనే మెయిన్టెయిన్ చేస్తాను. నా బాధను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా వారు నాపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. అందరూ సంతోషంగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను," అని తన పోస్ట్లో రాసుకొచ్చారు. సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న వివాహం చేసుకున్న నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది.

