టాలివుడ్ హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) నిన్న(మంగళవారం) రాత్రి తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు. చిత్రపరిశ్రమ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రగాడ సానుభూతి తెలిపారు. సోదరుడు రవి తేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చిరంజీవి ప్రకటించారు.

Next Story