కాజోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kajol: సోషల్ మీడియా యుగంలో ట్రోలింగ్ సర్వ సాధారణంగా మారింది. ప్రతి చిన్న అంశంపైనా చర్చలు, కామెంట్లు తీవ్రంగా మారాయి. ఇటీవల స్టార్ కిడ్స్ పై ఘోరమైన ట్రోలింగ్ సాగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్లో నట వారసుల అందచందాలు, విలాసాలు, లెగసీ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై తన అభిప్రాయం వెల్లడించింది సీనియర్ నటి కాజోల్. ప్రస్తుతం హారర్ మూవీ 'మా' ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. కుమార్తెను కాపాడుకునే తల్లి పాత్రను పోషించిన ఆమెను.. నిజ జీవితంలో మీ పిల్లల జోలికి ఎవరైనా వస్తే ఏం చేస్తారని ట్రోల్స్ ను ఉద్దేశించి మీడియా అడిగింది. కారుతో తొక్కేస్తానని సరదాగా సమాధానం చెప్పిన కాజోల్ .. పిల్లల ను కాపాడుకునే తల్లిగా ఒకప్పుడు చాలా సీరియస్ గా ఉండేదానినని చెప్పింది. ఇప్పుడు కొంత కూల్ గా ఉన్నానని కూడా చెప్పిన కాజోల్.. సోషల్ మీడియా, ట్రోలింగ్ జీవితంలో చిన్న భాగమంది. దానికి బదులుగా సానుకూల అంశాలపై దృష్టి పెట్టాలని తన పిల్లలకు సలహా ఇచ్చి నట్టు తెలిపింది. ట్రోల్ చేసే వారి సంఖ్య ఒక శాతం లేదా 0.1 శాతం మాత్రమే ఉంటారని చెప్పింది. కాగా, కాజోల్ బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్ ని 1999 లో పెళ్లి చేసుకున్నారు. 2003లో వీరికి కూతురు నైసా జన్మించింది. 2010లో కుమారుడు యుగ్‌ పుట్టాడు. ప్ర‌స్తుతం త‌న ఫ్యామిలీకి స‌మ‌యం కేటాయిస్తూనే అడ‌పాద‌డ‌పా సినిమాల‌లో న‌టిస్తూ అల‌రిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story