Taapsee Pannu: బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య ఎప్పటినుంచో సాగుతున్న మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి తాప్సీ నేరుగా మీడియా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ మధ్య వివాదం ఇంకా సజీవంగా ఉండటానికి విలేకరులే కారణమని నిందించారు. ముంబైలో జరిగిన తన తాజా చిత్రం గాంధారి ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఒక విలేకరి కంగనాతో ఉన్న వివాదంపై ప్రశ్నించగా తాప్సీ అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఈ అంశాన్ని మీరెందుకు వదిలేయట్లేదు? బహుశా ఈ వివాదాన్ని చూసి మీరే ఆనందిస్తున్నారేమో.. పదే పదే ఈ ప్రశ్నలు అడగడం ఆపేస్తే ఈ సమస్య ఎప్పుడో ముగిసిపోయేది" అంటూ ఘాటుగా బదులిచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. కంగనా మాట్లాడే తీరు ఆమె పెంపకాన్ని సూచిస్తుందని వ్యాఖ్యానించారు. దీనికి కంగనా తీవ్రంగా స్పందిస్తూ, తాప్సీని సస్తీ కాపీ (చౌకబారు నకలు) అని విమర్శిస్తూ తన తల్లిదండ్రుల పెంపకాన్ని తప్పుబట్టడంపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటు పోస్ట్ పెట్టి, ఆ తర్వాత డిలీట్ చేశారు. కంగనా సోదరి రంగోలి చందేల్ 2019లో తాప్సీని "సస్తీ కాపీ" అని సంబోధించిన నాటి నుంచి ఇరు వర్గాల మధ్య ఏదో ఒక సందర్భంలో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది.

Next Story