Balakrishna: కొత్త సాంగ్ తో లక్ష్మీ నరసింహ రీ రిలీజ్
లక్ష్మీ నరసింహ రీ రిలీజ్

Balakrishna:బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు..2004లో వచ్చిన ఈ మూవీ బాలకృష్ణ కెరీర్ బెస్ట్ చిత్రాల్లో ఒకటి . జయంత్ సి.పరాన్జీ డైరెక్షన్ లో బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ మూవీ ఘన విజయాన్ని అందుకుంది. ఈ మూవీని 4కె వెర్షన్లో జూన్ 8న థియేటర్స్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతుంది.
రీ రిలీజ్ వెర్షన్లో కొత్త పాటను యాడ్ చేసింది మూవీ టీం. మందేసినోడు' అంటూ సాగే పాటని భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశాడు. స్వరాగ్ కీర్తన్ హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్ కి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ మాస్ని లిరిక్స్ అందించారు. రీ రిలీజ్ సందర్భంగా జూన్ 5న ప్రెస్ మీట్ లో మాట్లాడిన డైరెక్టర్ జయంత్ సి ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందన్నార. ఇందులోని స్పెషల్ సాంగ్ కోసం చం ద్రబోస్, భీమ్స్ కలిసి అద్భుతం చేశారని అన్నారు. తన 31 ఏళ్ల సినీ సాహిత్య ప్రయాణంలో అతి విచిత్రమైనటువంటి విన్యాసం చేసిన పాట ఇదేనని చంద్రబోస్ అన్నారు. మధురమైన పాటగా నిలిచిపో తుందన్నారు. ఈ పాటని బాలయ్యబాబు అభిమానులు అందరికి అంకితం ఇస్తున్నామని అన్నారు. ఈ పాటకి పనిచేయడం చాలా స్పెషల్ అని భీమ్స్ చెప్పాడు. రీ రిలీజ్ ఈ పాట ప్రత్యేకంగా నిలుస్తుందని నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు.
