Lokesh Kanagaraj: ప్రతి సినిమాలో హీరోకి చాలా పారితోషికం ఉంటుందిది. తర్వాత మిగిలిన కళాకారులకు. చాలా సందర్భాలలో, డైరెక్టర్లకు తక్కువ పారితోషకం ఉంటుంది. కానీ, ఇప్పుడు కాలం మారిపోయింది. దర్శకుడికి కూడా హీరోతో సమానంగా రెమ్యునరేషన్ లభిస్తుంది. దీనికి కొత్త ఉదాహరణ లోకేష్ కనగరాజ్. రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాకు ఆయన దర్శకత్వం వహింస్తున్నారు. ఈ సినిమాకు పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

'కూలీ' సినిమా కోసం లోకేష్ కనగరాజ్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సినిమాలో కన్నడ ఉపేంద్ర, నాగార్జున, ఆమిర్ ఖాన్‌లు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం లోకేష్ 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు. దీనికి కారణం కూడా ఆయన చెప్పారు. ‘‘ఆ సినిమాకి నువ్వు 50 కోట్ల రూపాయలు తీసుకున్నట్లుగా ఉంది’’ అనే ప్రశ్నకు లోకేశ్ కు ఎదరైంది. దీనికి ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

‘‘మీరు నా 50 కోట్ల పారితోషకం గురించి అడుగుతున్నారు. కానీ నా చివరి సినిమా లియో బాక్సాఫీస్ వద్ద బాగా ఆడింది. రూ. 600 కోట్లు వసూలు చేసింది. కాబట్టి నా రెమ్యునరేషన్ కూడా రెట్టింపు అయింది. ఇది డిమాండ్ అండ్ సరఫరా రంగం. ప్రతి పైసా కోసం నేను కష్టపడి పనిచేస్తున్నాను’’ అని లోకేశ్ నమ్మకంగా చెప్పాడు. కూలీ సినిమా ట్రైలర్ ఆగస్టు 2న విడుదల కానుంది. ‘‘రజనీకాంత్ సినిమా చూశారు. వారి స్పందన నాకు చాలా సంతోషాన్నిచ్చింది. సినిమా చూసిన తర్వాత లేచి నిలబడి, నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. రజనీకాంత్ సర్ ఇంప్రెస్ అవ్వడం చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యా’’ అని లోకేశ్ తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story