ప్రభుత్వానికి తప్పుగా సమాచారం అందింది...
ధియేటర్ల బందుపై దిల్ రాజు వివరణ

ధియేటర్ల బంద్ విషయంలో ప్రభుత్వానికి రాంగ్ గా కమ్యూనికేట్ అయ్యిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. గతడచిన వారం రోజులుగా ధియేటర్ల బంద్ వ్యవహరాంపై జరుగుతున్న చర్చ... దీని వెనక ఆ నలుగురు ఉన్నారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. ముందుగా తొమ్మిది రోజులగా జరుగుతున్న ఈవివాదానికి పులిస్టాప్ పెట్టినందుకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి ధన్యవాదులు తెలుపుతున్నామని చెప్పారు. గత ఏప్రిల్ 19వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి సమావేశం జరిగిందని ఆ సమావేశంలో తమకు షేర్ విధానం కావాలని ఎగ్జిబిటర్స్ అడిగారని దిల్ రాజు తెలిపారు. నేను మంత్రి దుర్గేష్ తో మాట్లాడి బంద్ జరగదు అని చెప్పానన్నారు. ఏప్రిల్ 30వ తేదీ జరిగిన గిల్డ్ మీటింగ్ లో ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించామని, ఆరు నెలల లెక్కలు తీసుకుని పరిష్కరిద్దామని అనుకున్నామని ఆయన వివరించారు. మే 18వ తేదీన జరిగిన ఎగ్జిబిటర్స్ సమావేశానికి నేను కూడా వెళ్లానని అక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాకే చెందిన సత్యనారాయణ అనే ఎగ్జిబిటర్ ధియేటర్లు బంద్ చేస్తామనే ప్రస్తావన తెచ్చాడని ఆయన జనసేన నాయకుడని దిల్ రాజు చెప్పారు. అయితే ధియేటర్లు బంద్ చేయడం తప్పని నేను చెప్పానన్నారు. ఛాంబర్ కు లెటర్ ఇవ్వండి అందరూ మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పామన్నారు. అదే రోజు ధియేటర్ల బంద్ విషయం మీడియాలో రావడం తో అది స్పెడ్ అయి మిస్ కమ్యూనికేట్ అయ్యిందని అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా మే 21 న మీటింగ్ పెట్టి బండ్ గురించి చర్చించారని చెప్పారు. ప్రొడ్యూసర్లం 56 రోజులు షూటింగ్లు బంద్ చేసి ఏమీ సాధించలేకపోయామని, సినీపరిశ్రమలో ఎవరిది వారిదే అని నిన్న అల్లు అరవింద్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఈ రోజు నేను పెట్టానని వాస్తవానికి అందరం కలసి ప్రెస్ మీట్ పెట్టాలని రాజు పేర్కొన్నారు. ధియేటర్ల బంద్ విషయంల అసలు జరిగింది వేరు బయటకు వచ్చింది వేరు... ఈస్ట్ గోదావరి లో మొదలై అది అక్కడ నుంచి తెలంగాణకు వచ్చిందన్నారు. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళాలన్నారు. ఈ నెల 30 న జరిగే యాక్షన్ కమిటీ మీటింగ్ లో ఎగ్జిబిటర్స్ విషయాలు మిగతా సమస్యలు చర్చిస్తామని దిల్ రాజు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మాకు పెద్దన్న అని ఆయన తిట్టినా మేము పడతామని, అయితే మీడియా వల్ల ఆయనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ చేరిందని అందుకే ఆయన హర్ట్ అయ్యారని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆ నలుగురిలో నేను కూడా లేనన్నారు దిల్ రాజు.
