తాడేపల్లిలో ఓజీ స్పెషల్ సెట్

Pawan Kalyan: రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. హరిహరవీరమల్లును పూర్తి చేసిన పవన్ ఇపుడు ఓజీని పూర్తి చేసే పనిలో పడ్డాడు. సినిమా షూటింగ్ లో స్పీడ్ పెంచాడు. నిన్నటి వరకు ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తవ్వగా..ఇపుడు షూటింగ్ ను విజయవాడకు మార్చారు.

ఇవాళ్టి నుంచి ఓజీ కొత్త షెడ్యూల్‌‌‌‌ విజయవాడలో మొదలవుతోంది. దీని కోసం తాడేపల్లిలో స్పెషల్ సెట్‌‌‌‌ను వేశారట. ఈ షెడ్యూల్‌‌‌‌లో పవన్‌‌‌‌తో పాటు ఇతర నటీనటులంతా జాయిన్ కానున్నారు. ఈ షెడ్యూల్‌‌‌‌తో దాదాపు టాకీ పార్ట్ పూర్తికానుందని తెలుస్తోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్టులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలన్‌‌‌‌గా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

సెప్టెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు పవన్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌‌‌‌లో తెరకెక్కనున్న ‘ఉస్తాద్ భగత్‌‌‌‌సింగ్‌‌‌‌’ జూన్ సెకండ్ వీక్‌‌‌‌ నుంచి సెట్స్‌‌‌‌కు వెళ్లనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story