Manchu Vishnu: పాప్ కార్న్ సినిమాని చంపేస్తోంది : మంచు విష్ణు
సినిమాని చంపేస్తోంది : మంచు విష్ణు

Manchu Vishnu: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'తో ప్రేక్షకులను అల రించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 27న థియేటర్లలో రిలీజ్కనుంది. అయితే కొన్ని రోజులుగా దీని ప్రచారంలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న విష్ణు తాజాగా.. 'కన్న ప్ప' చిత్రానికి టికెట్ రేట్లు పెంచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు. మల్టీప్లెక్స్ పాప్కార్న్ ధరలపై మండిపడుతూ.. అవి క్రిమినల్ వేస్టేజ్ అని.. సినిమాని చంపేస్తున్నాయ్నారు. దీనిపై ప్ర భుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరారు. 'రేంజ్ రోవర్ కారు, మారుతి కారుకి తేడాలుంటాయి. రేంజ్ రోవర్ కారుని మారుతి కారు ధరకి అమ్మాలంటే కష్టం కదా. అలాగే పెద్ద సినిమాల నిర్మాత లు ఎక్కువ బడ్జెట్ తో సినిమాలు తీస్తారు కాబట్టి టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం కరెక్టే. అయితే దీని ప్రభావం చిన్న చిత్రాల మీద పడుతుంది. మరోవైపు మల్టీప్లెక్స్ పాప్ కార్న్ ధరలు కూడా సినిమాని చంపేస్తున్నాయి. కొన్నిచోట్ల ఒక్కో పాప్ కార్న్ రూ.450 వరకు తీసుకుంటున్నా రు. ఇది నిజంగా క్రైమ్. ఇలాంటి వాటిపై ప్రభు త్వాలు దృష్టి పెట్టాలి. నేను దర్శకత్వం వహిస్తే.. అమితాబ్ సినిమాకు డైరెక్టర్ గా వర్క్ చేస్తాను. అది నా కల. భారతీయులంతా ఆయన పనిని ఇష్టపడతారు' చెప్పుకొచ్చాడు. మరోవైపు ఏపీలో కన్నప్ప సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ల్లో రూ. 50 (జీఎస్టీ అదనం) వరకూ పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.
