రియల్ హీరో.. 5 రూపాయలకే పరోటా వేస్తున్న అభిమానికి రజనీకాంత్ గోల్డెన్ గిఫ్ట్
అభిమానికి రజనీకాంత్ గోల్డెన్ గిఫ్ట్

తమిళనాడులోని మధురైకి చెందిన రజనీ శేఖర్ అనే వ్యక్తి రజనీకాంత్కు వీరాభిమాని. ఆయన తన హోటల్లో పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గత కొన్నేళ్లుగా కేవలం 5 రూపాయలకే పరోటాను విక్రయిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా సూపర్స్టార్ దృష్టికి వెళ్లడంతో, ఆయన వెంటనే స్పందించారు.
చెన్నై నివాసంలో ఆత్మీయ భేటీ
రజనీకాంత్ స్వయంగా శేఖర్ కుటుంబాన్ని చెన్నైలోని తన పోయెస్ గార్డెన్ నివాసానికి ఆహ్వానించారు. వారితో సరదాగా గడిపి, శేఖర్ చేస్తున్న గొప్ప పనిని మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా శేఖర్కు గుర్తుండిపోయేలా ఒక బంగారు గొలుసును బహుమతిగా అందించారు. తన అభిమాని ఇంతటి గొప్ప సేవా కార్యక్రమంలో ఉండటం గర్వంగా ఉందని రజనీ పేర్కొనడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఏప్రిల్ నుంచి కొత్తసినిమా
సినిమా రంగంలో కూడా తలైవర్ స్పీడ్ పెంచారు. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో వస్తున్న జైలర్ 2 చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవల కేరళలో జరిగిన కీలక షెడ్యూల్ను పూర్తి చేశారు. ఈ చిత్రం జూన్ 12న విడుదలయ్యే అవకాశం ఉంది. పొంగల్ సందర్భంగా రజనీకాంత్ తన 173వ సినిమా గురించి అధికారిక ప్రకటన చేశారు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘ప్రతి కుటుంబంలో ఒక హీరో ఉంటాడు’ అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది.

