డిమాండ్ చేస్తున్న కన్నడ బ్యూటీ

Rukmini Vasant: ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ కాంబో ప్రాజెక్టులో రుక్మిణీ వసంత్ హీరోయిన్ ఫిక్స్ అయినట్లు ఇటీవలే వార్తలొచ్చాయి. ఈ మధ్యనే అమ్మడు షూటింగ్ పాల్గొన్నట్లు తెలుస్తుంది. సప్త సాగరాలు దాటి మూవీతో సూపర్ పాపులర్ అయిన ఆమె టాలీవుడ్ లో ఫేవరెట్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. సాధారణంగానే కన్నడ నుంచి వచ్చిన భామలకు మంచి కిమాండ్ ఉంటుంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకు లను అలరించడంతో రుక్మీణి టాలీవుడ్లో వరుస చాన్స్ లు దక్కించుకుంటుంది.

కన్నడ మూవీల్లో హీరోయిను అంత ఎక్కువగా పారితోషికం ఉండదు. స్టార్ హీరోయిన్స్ కే కోటి రూపాయలకు మించి ఇవ్వరు. కానీ ఎన్టీఆర్ తో చాన్స్ దక్కిం చుకున్న ఈ అమ్ముడు స్టార్ స్టాటస్ కొట్టేసినట్లే. దీంతో ఈ మూవీలో నటించేందుకు కూడా భారీగానే రెమ్యునరే షన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మేకర్స్ ఇచ్చిన రెమ్యునరేషన్ తీసుకోవడమే తప్ప తాను డిమాండ్ చేసిన పరిస్థితి లేదు. కానీ ఈ మూవీ కోసం అమ్మడు కోటిన్నర దాకా డిమాండ్ చేసిందని టాక్. కాస్త ఫాంలో ఉన్న హీరో యిన్స్ కే టాలీవుడ్లో రెండు నుంచి మూడు కోట్ల వరకు పారితోషికంఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాదు. ఈ మధ్య స్టార్ హీరోలంతా భారీగా రెమ్యున రేషన్ పెంచారు కాబట్టి హీరో యిన్స్ కూడా అందుకు తగ్గట్లు డిమాండ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

PolitEnt Media

PolitEnt Media

Next Story