సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ వైరల్

Samantha's Instagram Post: స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై మరోసారి ఆసక్తి రేపారు. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఆమె చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఈ వదంతులకు మరింత బలాన్నిచ్చింది.

వివరాల్లోకి వెళితే.. సమంత ఇటీవల దుబాయ్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్‌కు రాజ్ నిడిమోరుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతిలో చేయి వేసి నడుస్తున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోలో రాజ్ ముఖం స్పష్టంగా కనిపించనప్పటికీ, అది ఆయనేనని నెటిజన్లు, అభిమానులు భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టులో ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ కూడా కనిపించారని సమాచారం. ఈ కొత్త పోస్ట్‌తో వీరి బంధం గురించిన చర్చ నెట్టింట మళ్లీ మొదలైంది.

గత కొంతకాలంగా సమంత - రాజ్ మధ్య ఏదో నడుస్తోందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్లడంతో పాటు, ఒకే ఇంట్లో ఉంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. పలు సందర్భాల్లో సమంత ఆయనతో ఉన్న ఫొటోలను పంచుకోవడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది. అయితే, రాజ్‌కు ఇదివరకే వివాహం కావడం ఈ విషయంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బంధంపై ఆయన భార్య కూడా సోషల్ మీడియాలో పరోక్షంగా కొన్ని పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.

నాగచైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ బారిన పడటంతో సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ప్రస్తుతం తన ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే రాజ్ నిడిమోరుతో ఆమెకు సాన్నిహిత్యం పెరిగినట్లు తెలుస్తోంది. ఈ రూమర్లపై సమంత ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ, ఆమె తాజా పోస్ట్ ద్వారా తమ బంధం గురించి పరోక్షంగా ఓ హింట్ ఇచ్చిందని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story