Icon Star Allu Arjun: నెగెటివిటీకి దూరంగా ఉండండి.. అభిమానులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక సూచన..
స్టార్ అల్లు అర్జున్ కీలక సూచన..
Icon Star Allu Arjun: పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. హైదరాబాద్లోని యూసుఫ్గూడ శౌర్య భవన్ వేదికగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు 600 మందికి పైగా అభిమానుల కోలాహలంతో ఆ ప్రాంగణం సందడిగా మారింది.
ట్రోలింగ్ సంస్కృతిపై పరోక్ష వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన అల్లు అర్జున్.. సోషల్ మీడియాలో ఇటీవల పెరుగుతున్న అనవసర వివాదాలు, నెగెటివిటీపై పరోక్షంగా స్పందించారు. నెట్టింట్లో సాగే వ్యర్థమైన ప్రచారాలను, ట్రోలింగ్స్ను అస్సలు పట్టించుకోవద్దని అభిమానులకు హితవు పలికారు. అనవసరమైన విషయాలపై ఎనర్జీని, సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తూ, ఆ శక్తిని సమాజానికి ఉపయోగపడే మంచి పనులకు, సొంత ఎదుగుదలకు వినియోగించాలని పిలుపునిచ్చారు.
అభిమానులతో ముచ్చట..
తనపై చూపిస్తున్న అపరిమితమైన ప్రేమ, అభిమానానికి బన్నీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సభకు హాజరైన అభిమానులతో కలిసి ఆప్యాయంగా గ్రూప్ ఫొటోలు దిగారు. సమాజంలో సానుకూలతను పెంపొందించేలా, నెగెటివిటీకి దూరంగా ఉండాలని అల్లు అర్జున్ ఇచ్చిన సందేశంపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి విశేష ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశంతో అభిమానులకు, ఐకాన్ స్టార్కి నడుమ ఉన్న బంధం మరింత బలపడిందని అభిమాన సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

