రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్, ఏ.ఆర్. మురుగదాస్ కలిసి తొలి ప్రాజెక్ట్ ప్రకటింపు

బాలీవుడ్‌లో మరో భారీ యాక్షన్ థ్రిల్లర్‌కు రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాతలు రితేష్ సిద్ధ్వానీ మరియు ఫర్హాన్ అక్తర్ తొలిసారి దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్తో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సన్నీ డియోల్ మరియు జ్యోతిక సదాన్నా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.


ఇప్పటికీ టైటిల్ ఖరారు కాని ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి బాలాజీ గణేష్ దర్శకత్వం వహించనున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ అంశాలతో కూడిన ఈ సినిమా ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ అనుభూతిని అందించనుందని చిత్రబృందం వెల్లడించింది.




ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే — బాలీవుడ్ యాక్షన్ ఐకాన్ సన్నీ డియోల్ మరియు శక్తివంతమైన నటనకు పేరొందిన జ్యోతిక ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటం. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2026 ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం.

ఇండియన్ సినిమా పరిశ్రమలో మూడు భారీ పేర్లు — రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్, ఏ.ఆర్. మురుగదాస్ — ఒకే ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేయడం ఇదే తొలిసారి కావడంతో, ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. త్వరలోనే టైటిల్, మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Updated On 27 Jan 2026 1:44 PM IST
Lipika Varma

Lipika Varma

Next Story