Chiranjeevi: ప్రతిబంధ్ లో జూహీ చావ్లా ఎంపిక వెనక అసలు కథ.. మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు వైరల్..
మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు వైరల్..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ ఎంట్రీ చిత్రం ప్రతిబంధ్ కు సంబంధించి గతంలో ఆయన పంచుకున్న ఆసక్తికర విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా జూహీ చావ్లాను ఎంచుకునే క్రమంలో తొలుత తాము ఎందుకు ఆలోచించాల్సి వచ్చిందో చిరంజీవి వివరించారు.
బబ్లీ ఇమేజ్ చూసి సందేహం
ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రంలో జూహీ చావ్లా చాలా చలాకీగా, టీనేజ్ పాత్రలో కనిపించారు. దాంతో ప్రతిబంధ్ కథలోని శాంతి అనే సీరియస్, ఎమోషనల్ పాత్రకు ఆమె ఎంతవరకు న్యాయం చేయగలదనే సంశయం తమకు కలిగిందని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
నిర్ణయాన్ని మార్చిన ఆ ఒక్క ఫొటో:
అయితే కథలోని పాత్ర రూపానికి సరిగ్గా సరిపోయేలా ఉన్న ఆమె ఒక ఫొటోను చూసిన తర్వాత తమ అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ఆ క్యారెక్టర్కు అవసరమైన అమాయకత్వం, భావోద్వేగాలు ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించడంతో వెంటనే ఆమెను సంప్రదించగా, జూహీ వెంటనే అంగీకరించారు.
కీలక సన్నివేశాల్లో అద్భుత నటన:
సినిమాలో జూహీ చావ్లా తన పెర్ఫార్మెన్స్తో అందరినీ మెప్పించిందని చిరంజీవి కొనియాడారు. ముఖ్యంగా కోర్టు డ్రామా, జైలు వద్ద సాగే ఎమోషనల్ సీన్లలో ఆమె అద్భుతంగా నటించి చిత్ర విజయానికి తోడ్పడ్డారని ప్రశంసించారు.
తెలుగులో బ్లాక్బస్టర్గా నిలిచిన అంకుశం చిత్రానికి రీమేక్గా దర్శకుడు రవిరాజా పినిశెట్టి తెరకెక్కించిన ప్రతిబంధ్ చిత్రం ద్వారానే చిరంజీవి హిందీ తెరకు పరిచయమై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు.



