Madhavan on ‘Dhuranthar’: అసలు కథ పార్ట్ 2లోనే.. జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే.. దురంధర్పై మాధవన్..
దురంధర్పై మాధవన్..

Madhavan on ‘Dhuranthar’: బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. డిసెంబరు 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 552 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ చిత్రంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా కీలక పాత్ర పోషించిన నటుడు మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'ధురంధర్ కేవలం అసలు కథకు ఒక ట్రైలర్ మాత్రమేనని ఆయన అభివర్ణించారు. అసలు సినిమా ధురంధర్ 2లో ఉంటుంది అని చెబుతూ అంచనాలను మరింత పెంచారు. సీక్వెల్లో రణ్వీర్ సింగ్ నటన మరో స్థాయిలో ఉంటుందని, తన పాత్రకు కూడా ప్రాధాన్యం పెరుగుతుందని మాధవన్ వ్యాఖ్యానించారు. ధురంధర్ 2 చిత్రాన్ని 2026 మార్చి 19న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
రణ్వీర్ సింగ్ భావోద్వేగ పోస్ట్
భారీ విజయంతో దూసుకుపోతున్న ఈ చిత్రంపై హీరో రణ్వీర్ సింగ్ సోషల్ మీడియాలో స్పందించారు. తన గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. "అదృష్టానికి మంచి అలవాటు ఉంది. సమయానికి తగ్గట్టు అది మారుతూ ఉంటుంది. కానీ ఓర్పు చాలా ముఖ్యం" అని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు మూడున్నర గంటల నిడివి ఉన్నప్పటికీ, పటిష్టమైన కథనంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. రణ్వీర్ సింగ్తో పాటు అక్షయ్ ఖన్నా నటనకు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.

