Soundarya Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లకు పైగా సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ అద్భుతమైన సుదీర్ఘ కెరీర్‌లో ఆయన అపారమైన విజయాలు, ఆరాధనతో పాటు ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు మరియు పలు వివాదాలను, ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు.

ప్రస్తుతం 75 ఏళ్ల వయసులోనూ రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద రికార్డు హిట్లతో దూసుకుపోతున్నారు. ఆయన ప్రస్తుతం ‘ధర్మన్’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉండటంతో పాటు అక్టోబర్‌లో విడుదల కానున్న ‘జైలర్ 2’ సినిమాలో ముత్తువేల్ పాండియన్‌గా అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ బిజీ షెడ్యూల్ మధ్యలోనే ఆయన తన ఆత్మకథను రాయడంపై దృష్టి సారించారు.

ఈ విషయమై రజినీకాంత్ కుమార్తె సౌందర్య రాజ్‌కాంత్ స్పందిస్తూ.. తన తండ్రి సొంతంగా ఆత్మకథ రాస్తున్న విషయాన్ని ధృవీకరించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథం "ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి" (ఒక యోగి ఆత్మకథ) ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో, రజినీకాంత్ ఆత్మకథ కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదవాల్సిన ఒక గొప్ప పుస్తకంగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

అయితే, రజినీకాంత్ జీవిత చరిత్ర ఆధారంగా ఎలాంటి 'బయోపిక్' సినిమా తీసే ఆలోచన మాత్రం ప్రస్తుతం లేదని సౌందర్య స్పష్టం చేశారు. సాధారణ బస్సు కండక్టర్ నుంచి దేశమే మెచ్చిన తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగిన ఆయన అసాధారణ ప్రయాణం, అనుభవాలు, పడిన శ్రమ మరియు సాధించిన మైలురాళ్లను ఈ ఆత్మకథ ద్వారా నేరుగా అభిమానులకు అందించనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story