గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్..

Gaddar Awards: ఇవాళ హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ 4 లో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు జరగనున్నాయి. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు వేడుకలకు హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 14 ఏండ్ల తర్వాత సినిమా అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. 2024కు సంబంధించి అన్ని కేటగిరీలకు చెందిన అవార్డులు ప్రదానం చేయనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో వేడుకలు జరపనున్నారు.కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి సినీ రంగం నుంచి ఎక్కువమంది ప్రముఖులు వస్తున్నందున పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు.

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు' అందుకోబోతున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ కళారంగంలో వేగుచుక్కలాంటివారైన గద్దర్ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించటం గర్వకారణమని పేర్కొన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వగా 2014 నుంచి ఆ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ 10 ఏండ్ల తర్వాత ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story