Karnataka: కమల్ సినిమాకు మేమే రక్షణ కల్పిస్తాం: కర్ణాటక
మేమే రక్షణ కల్పిస్తాం

Karnataka: కమల్ హాసన్ నటించిన సినిమా థగ్ లైఫ్ స్క్ర్కీనింగ్ కు రక్షణ కల్పి స్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నేడు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దీంతో కన్నడనాట ఈ చిత్రంపై అనధికారిక బ్యాన్కు సంబంధించి దాఖలైన పిల్ ను జస్టిస్ ఉజ్జుల్ భూయాన్, జస్టిస్ మన్మోహన్ బెంచ్ విచారించింది.
ఈ సందర్భంగా బెంచ్ పలు కీలక వ్యా ఖ్యలు చేసింది. తరుచూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పలు సంఘాలు ఆందోళనలు చేయడంతో కళాసృష్టి నిలిచిపోతోందని పేర్కొంది. "వీటిని ఇక ఏమాత్రం కొనసాగనీయం. కేవలం ఒక అభిప్రాయం వల్ల ఒక చిత్రాన్ని ఆపేయాలా... స్టాండప్ కామెడీని నిలిపివేయాలా?" అని బెంచ్ ప్రశ్నించిం ది. సీబీఎఫ్సీ నుంచి అనుమతి వచ్చిన ఈ చిత్ర ప్రదర్శనను ఆందోళనకా రులు అడ్డుకోకుండా చూడాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో సినిమాకు రక్షణ కల్పిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
