• సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలన్న నిర్ణయంపై ఆరా తీస్తున్నామని వెల్లడి
  • హోం శాఖ సెక్రటరీతో విచారణ చేపట్టాలని నిర్ణయించామన్న మంత్రి దుర్గేష్
  • హరిహరవీరమల్లు విడుదలకు ముందు ఇది దేనికి సంకేతం
  • -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే వ్యవహారంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తుల నుంచే ఒత్తిడి వస్తోందనే వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించి హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తో మాట్లాడారు. ఈ పరిణామంతోపాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని దుర్గేష్ హోంశాఖ ముఖ్యకార్యదర్శిని కోరారు. సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే కోణంలోనూ వివరాలు సేకరించాలని మంత్రి సూచించారు.

ఈ వ్యవహారంలపై మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు, ఎగ్జిబిటర్లకు, డిస్టిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకే హోం శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో విచారణ చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ ధియేటర్ల మూసివేత అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు. జూన్ 1వ తేదీ నుండి సినిమా థియేటర్ల బంద్ చేయబోతున్నారన్న విషయం కొన్ని రోజులుగా ప్రచారంలోకి వచ్చిందని, దీనికి ప్రోద్భలం అందిస్తున్న వ్యక్తులెవరు, జరుగుతున్నదేమిటి తదితర అంశాలన్నింటిపై విచారణ జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలను ఆరా తీసి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సినీ పరిశ్రమకు చెందిన ఏ సమస్య అయినా సినిమాటోగ్రఫీ మంత్రిగా తనతో మాట్లాడాలని సినీ పెద్దలకు డిప్యూటీ సీఎం నాడు సూచించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇప్పటివరకు సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఆకస్మాత్తుగా థియేటర్ల బంద్ అనే అంశం తెరపైకి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. దీని వెనుక ఉన్న కారణాలను ఆరా తీస్తున్నామన్నారు. జూన్ 12వ తేదీన పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు చిత్రం విడుదలవుతున్న సందర్భంలో ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చిందో తెలియడం లేదన్నారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. థియేటర్ల మూసివేత అనే అంశంలో ఎవరితోనైనా చర్చించి నిర్ణయం తీసుకున్నారా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆకస్మాత్తుగా థియేటర్లను మూసివేస్తామని నిర్ణయం తీసుకోవడానికి దోహద పడిన కారణాలేంటని అడిగారు. ఈ అంశాలన్ని తెలుసుకునేందుకే పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని, తద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టతనిచ్చారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story