Mahesh Babu: మరోసారి మహేశ్ బాబుకు లీగల్ నోటీసులు..ఎందుకంటే.?
లీగల్ నోటీసులు..ఎందుకంటే.?
Mahesh Babu: నటుడు మహేష్బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.సాయి సూర్య రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని మహేష్తో పాటు సంస్థ ప్రతినిధులకు కమిషన్ నోటీసులు జారీ చేసింది.ఈ కేసులో మహేష్ బాబును మూడో ప్రతివాదిగా పిటిషనర్లు చేర్చారు.
ఈ కేసులో మహేష్ బాబుకు గతంలోనూ నోటీసులు జారీ చేసింది. ఈడీ ముందుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 28నే విచారణకు హాజరు కావలసిందిగా ఈడీ మొదట నోటీసులు ఇచ్చింది. షూటింగ్ కారణంగా హాజరు కాలేనని.. మరో తేదీన హాజరవుతానని మహేష్ బాబును ఈడీని అభ్యర్థించాడు మహేష్ బాబు.ఈ క్రమంలో మరోసారి నోటీసులిచ్చింది
సాయి సూర్య డెవలపర్స్కు మహేష్ బాబు బ్రాండ్ ప్రమోషన్ చేశాడు. ఇందుకు గానూ.. మహేష్ బాబు మొత్తం రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 3.4 కోట్లు నగదు రూపంలో, రూ. 2.5 కోట్లు RTGS ద్వారా తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ లావాదేవీలపై విచారించేందుకే మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
