ఇండియా ఇచ్చిన గిఫ్ట్ యోగా

Chiranjeevi: ప్రపంచానికి ఇండియా ఇచ్చిన గిఫ్ట్ యోగా అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. జూన్ 21న యోగా దినోత్సవాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసు కోవాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. 'ఫోకస్ వల్ల ఫిట్నెస్ పెరుగుతుంది. యోగా చేస్తే ఈ రెండూ వస్తాయి. వరల్డ్ కు మన దేశం ఇచ్చిన బహుమతి యోగా. సరిహద్దులు దాటి దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం' అంటూ ట్వీట్ చేశారు.

ఇక మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ పాల్గొంటూ సూపర్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిత్రీకరణ ప్రారంభంకాగా.. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిరం జీవితో పాటు టీమ్ంతా డెహ్రాడూన్ వెళ్లారు. అక్కడ ఓ సాంగ్ తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. ఇక ఈమూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయ నున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇక‌, యోగాకు మ‌రింత ప్రాచుర్యం క‌ల్పించేందుకు ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అంత‌ర్జాతీయ యోగా మాసోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో యోగా డేను నిర్వ‌హిస్తున్నారు. దీనిపై ప్ర‌ధాని మోదీ కూడా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఏపీలో యోగా దినోత్స‌వంపై ప్ర‌జ‌ల్లో ఉత్స‌హాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంద‌ని మోదీ అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story