దంపతులు ఈ పనులు అస్సలు చేయొద్దు

Devotional:గరుడ పురాణం హిందూ మతంలోని 18 గొప్ప పురాణాలలో ఒకటి. వ్యాస మహర్షి రచించిన ఈ పురాణాన్ని విష్ణువు తన భక్తుడైన గరుడకి బోధించాడని నమ్ముతారు. అందుకే ఈ పురాణం గరుడ పురాణం అని పిలువబడింది. ఇది ఒక వ్యక్తి చేసిన కర్మ గురించి, మరణం తరువాత స్వర్గం, నరకంలో ఆత్మ ప్రయాణం ఎలా కొనసాగుతుందో వివరిస్తుంది.

గరుడ పురాణం ప్రకారం.. భార్యాభర్తల పవిత్ర సంబంధంలో జోక్యం చేసుకోవడం లేదా వారి గోప్యతను ఉల్లంఘించడం తీవ్రమైన పాపమని గరుడ పురాణం స్పష్టంగా పేర్కొంది. ఈ గోప్యతను ఎవరైనా ఉల్లంఘిస్తే, వారు కఠినమైన శిక్షను ఎదుర్కొంటారు.

గరుడ పురాణం ప్రకారం.. దంపతులు లేదా ప్రేమజంట తమ భాగస్వామి వ్యక్తిగత సంబంధాల్లో జోక్యం చేసుకోవడం, వారి వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పడం లేదా వారి నమ్మకాన్ని వమ్ము చేయడం అధర్మంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా మూడో వ్యక్తి సైతం భార్యభర్తలు లేదా ప్రేమికుల సంబంధాల్లో జోక్యం చేసుకోకూడదు. వాళ్ల బంధం విడిపోయేందుకు కారణం కాకూడదు. అలా చేసే వ్యక్తి మరణానంతరం నరకానికి చేరుకుంటాడని గరుడ పురాణం చెబుతోంది. ఎందుకంటే గోప్యతను ఉల్లంఘించడం మహా పాపం.

గరుడ పురాణంలో.. భార్యాభర్తల మధ్య సంబంధం చాలా పవిత్రమైనది. అందువల్ల వారి గోప్యతను ఉల్లంఘించడం సామాజిక నేరమే కాదు.. ఆధ్యాత్మిక, కర్మ దృక్కోణం నుండి తీవ్రమైన పాపం కూడా. దీని పర్యావసానాలు మరణం తరువాత తీవ్రమైన నరకయాతన అనుభవిస్తారు. కాబట్టి ఇతరుల వైవాహిక సంబంధంలో ఎప్పుడూ జోక్యం చేసుకోకండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story