మరో అద్భుతం

Devotional:యూపీలోని అయోధ్య రామాలయంలో మరో అద్భుత కార్యక్రమం జరిగింది. అయోధ్యలో ఉన్న రామ మందిరంలోని రామ దర్బార్ , మరో ఏడు ఆలయాలను ప్రతిష్టించారు. రామ దర్బార్‌లో ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యాయి. శ్రీరాముడు, మాతా జానకి , హనుమంతుడి విగ్రహాలను ప్రతిష్టించారు.ఈ ప్రాణ ప్రతిష్ఠ ఆచారాన్ని చందౌలి జిల్లాకు చెందిన ప్రసిద్ధ పండిట్ జైప్రకాష్ నేతృత్వంలో 101 మంది వేద ఆచార్యులు నిర్వహించారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ఈ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది . రామ దర్బార్ ముందు యోగి ప్రార్థనలు చేశారు. ఈ రోజు ఆలయంలోని మొదటి అంతస్తులో రామ దర్బార్ ప్రతిష్టించబడినందున దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి వేలాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు.

ఆలయాన్ని ఆధునిక భద్రతా పరికరాలతో పర్యవేక్షిస్తున్నారు. ATS, CRPF, PAC, సివిల్ పోలీసు సిబ్బంది బృందాలను మోహరించారు.అయోధ్యలో మొదటి ప్రతిష్ట కార్యక్రమం 2024 జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story