Devotional: ఓ వైపు నృసింహుడు.. మరో వైపు ఆంజనేయుడు.. కొండగట్టు విశేషాలు తెలుసుకోండి!
కొండగట్టు విశేషాలు తెలుసుకోండి!

Devotional: చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ల వరకు ప్రతిఒక్కరికి ఇష్టమైన దైవం ఆంజనేయుడు. మన దేశంలో చాలా ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. అందులో ఒకటి కొండగట్టు. ఇది తెలంగాణలోని జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, ముత్యంపేట గ్రామానికి దాదాపు 3.5 కి.మీ.లు దూరంలో ఉంది. ఈ గుడిలో 41 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల నమ్మకం.
పూర్వము రామ రావణ యుద్ధము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చునపుడు ముత్యంపేట అనెడి ఈ మార్గమున కొంతభాగము విరిగిపడుతుంది. ఆ భాగమునే కొండగట్టుగా కల పర్వతభాగముగా పిలుస్తున్నారు.
ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ
ఉదయం 4.30 నుంచి ఉదయం 5.45 గంటల వరకు శ్రీ స్వామివారి ఆరాధన
మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు విరామం (మంగళ, శనివారాలు మినహా.. ఆలయ మూసివేత)
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు విరామం ఉంటుంది. రాత్రి 8 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.
