Gandhari’s Curse: మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత, కురుక్షేత్రంలో కురువంశం అంతా నాశనం కావడం చూసి గాంధారి తీవ్ర ఆవేదనకు లోనవుతుంది. తన వందమంది కొడుకులు, బంధువులు అందరూ చనిపోయినందుకు గాంధారికి కృష్ణుడు కారణమని ఆమె భావిస్తుంది.

కృష్ణుడు యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉండి కూడా ఆపలేదని, కావాలనే కక్షసాధింపుతోనే కురువంశాన్ని నిర్మూలించాడని గాంధారి ఆరోపిస్తుంది. ఆగ్రహంతో, దుఃఖంతో ఉన్న గాంధారి కృష్ణుడికి ఒక భయంకరమైన శాపం పెడుతుంది.

గాంధారి శాపం ఇదే:

"ఏ విధంగానైతే నీ కళ్లముందే నా వంశం, నా కొడుకులు నాశనమయ్యారో, అదే విధంగా ముప్పై ఆరేళ్ల తర్వాత నీ వంశం (యాదవ వంశం) కూడా నీ కళ్లముందే ఒకరిని ఒకరు చంపుకుని, నాశనమైపోతుంది. నీ ద్వారక నగరం కూడా సముద్రంలో మునిగిపోతుంది" అని శపిస్తుంది.

కృష్ణుడు ఆ శాపాన్ని ప్రశాంతంగా, నవ్వుతూ స్వీకరిస్తాడు. ఎందుకంటే, యాదవ వంశం మరీ గర్విష్టులుగా తయారైందని, వారు భూమికి భారంగా మారారని కృష్ణుడికి తెలుసు. తన వంశం అంతం కావడానికి అదే సరైన సమయమని ఆయన భావించి, శాపాన్ని చిరునవ్వుతో అంగీకరిస్తాడు.

ఆ శాపం ఎలా నిజమైంది?

గాంధారి శాపించిన విధంగానే సరిగ్గా ముప్పై ఆరేళ్ల తర్వాత, ద్వారకలో యాదవ వంశీయులు విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఒకరోజు యాదవులు మదించి, ఒకరిని ఒకరు అవమానించుకుంటూ, చివరకు 'ఏరక' అనే గడ్డిని ఆయుధాలుగా చేసుకుని భీకరంగా కొట్టుకున్నారు. కృష్ణుడి కళ్లముందే తన వంశం అంతా నాశనమైపోయింది.

చివరికి కృష్ణుడు కూడా ఒక వేటగాడి బాణం తగలడం వల్ల ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. గాంధారి శాపం ద్వారా కృష్ణుడు తన అవతార సమాప్తికి మార్గం సుగమం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story