మరణానికి ముందు ఆవును దానం చేస్తే ఏమవుతుంది?

Garuda Purana Secret: హిందూ మతంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణం అత్యంత విశిష్టమైనది. భగవాన్ విష్ణువు, పక్షిరాజు గరుత్మంతుడి మధ్య జరిగిన సంభాషణే ఈ పురాణం. ఒక వ్యక్తి మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది? చేసిన పాపపుణ్యాలకు శిక్షలు ఎలా ఉంటాయి? అనే విషయాలను ఇది వివరంగా వివరిస్తుంది. ముఖ్యంగా మరణానికి ముందు చేసే గోదానం ఒక వ్యక్తి ఆత్మను నరకయాతన నుంచి ఎలా కాపాడుతుందో గరుడ పురాణం స్పష్టం చేస్తోంది.

భయంకరమైన వైతరణి నది

గరుడ పురాణం ప్రకారం, మరణం తర్వాత ఆత్మ యమలోకానికి వెళ్లే మార్గంలో వైతరణి అనే నదిని దాటాల్సి ఉంటుంది. ఈ నది సాధారణమైనది కాదు.. ఇందులో నీటికి బదులు రక్తం, చీము, మలినం ప్రవహిస్తాయి. భయంకరమైన జీవులు, ఆకాశాన్ని తాకే మంటలతో నిండి ఉండే ఈ నదిని దాటడం పాపాత్ములకు అసాధ్యమని చెప్పబడింది. జీవితకాలంలో చెడు పనులు చేసిన వారు ఈ నదిలో పడి చిత్రహింసలు అనుభవిస్తారు.

గోదానం: వైతరణిని దాటించే నావ

హిందూ ధర్మంలో ఆవును దానం చేయడం అన్నిటికంటే ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి మరణానికి ముందు ఆవును దానం చేస్తే, ఆ పుణ్యఫలం వల్ల అతనికి వైతరణి నదిని దాటడం సులభమవుతుంది.

ఆవు తోకను పట్టుకుని..

పురాణాల ప్రకారం, గోదానం చేసిన వ్యక్తి ఆత్మ వైతరణి నది ఒడ్డుకు చేరుకోగానే, అతను దానం చేసిన ఆవు అక్కడ కనిపిస్తుంది. ఆ ఆత్మ ఆవు తోకను పట్టుకుని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ భయంకరమైన నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరుకుంటుంది.

గోదానం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు

యమదూతల నుండి విముక్తి: ఆవును దానం చేసిన పుణ్యాత్ములను యమదూతలు హింసించరు. వారు ఆ ఆత్మను గౌరవంగా తీసుకువెళ్తారని విశ్వాసం.

పాప ప్రక్షాళన: తెలిసీ తెలియక చేసిన పాపాల ప్రభావం గోదానం వల్ల తగ్గుతుంది.

మోక్ష ప్రాప్తి: అటువంటి వ్యక్తికి మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి లేదా పునర్జన్మ లేని మోక్షం లభిస్తుందని గరుడ పురాణం చెబుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story