Free Bus Services: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్! తిరుమలలో ఉచిత బస్సు సేవలు ప్రారంభం
ఉచిత బస్సు సేవలు ప్రారంభం

Free Bus Services: తిరుమలలో ఉచిత బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. తిరుమలలోని వివిధ ప్రాంతాలకు భక్తులను చేరవేయడానికి ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఉచిత బస్సు సేవలను తిరుమల అశ్విని ఆసుపత్రి సర్కిల్ వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. తిరుమల గిరులపై ప్రైవేటు వాహనాల ద్వారా అధికంగా డబ్బులు వసూలు చేయడం, కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా, మొదటి దశలో 150 బస్సులను నడపనున్నారు. ఈ బస్సులు శ్రీవారి ధర్మ రథాలు తిరిగే మార్గంలోనే నడుస్తాయి. ముఖ్యంగా, మహిళా భక్తులకు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇటీవల కాలంలో ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న భక్తుల ఫిర్యాదుల నేపథ్యంలో, TTD & APSRTC సంయుక్తంగా ఉచిత బస్సు సేవలు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టాయి.
మొదటి దశలో 150 బస్సులు
తిరుమలలోని ముఖ్య ప్రాంతాలకు చేరేందుకు ఉచిత బస్సులు
ప్రైవేట్ టాక్సీల దందాకు చెక్
భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం
ఈ నూతన సేవల వల్ల భక్తులకు గొప్ప ఊరట కలుగనుంది. ఇప్పటికే తిరుమలలో ఉన్న ఎలక్ట్రిక్ బస్సులతో పాటు APSRTC బస్సులు కూడా ఈ సేవలో చేరనున్నాయి.
ఇవి ఇప్పటికే తిరుమలలో తిరుగుతున్న 12 శ్రీవారి ధర్మరథాలకు అదనంగా ఆర్టీసీ బస్సులు 80 ట్రిప్పులు తిరుగుతాయి. దీని వల్ల ప్రతి ఐదు నిముషాలకు ఉచిత బస్సు భక్తులకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ప్రతి మూడు నిముషాలకు ఈ ఉచిత బస్సు అందుబాటులోనికి తీసుకువస్తామని వెంకయ్య చౌదరి తెలిపారు.
