వాస్తు దోషాలకు చెక్ పెట్టే దేవలోక వృక్షం

హవింగ్ This Plant at Home Is Like Inviting Goddess Lakshmi: ప్రకృతిలో మనకు కనిపించే ప్రతి మొక్కలోనూ ఏదో ఒక విశిష్టత ఉంటుంది. కానీ కొన్ని మొక్కలు మాత్రం సాక్షాత్తూ దైవ స్వరూపాలుగా భావించబడతాయి. అటువంటి వాటిలో పారిజాత వృక్షం అత్యంత పవిత్రమైనది. దీనిని కేవలం మొక్క అనడం కంటే ఇంటికి సిరిసంపదలను తెచ్చే దేవలోకపు కానుక అనడం సబబు. పురాణాల ప్రకారం.. సముద్ర మథనం జరిగినప్పుడు ఉద్భవించిన 14 రత్నాలలో పారిజాతం ఒకటి. అందుకే దీనిని మహాలక్ష్మికి సోదరుడిగా భావిస్తారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అనే ముగ్గురు అమ్మవార్ల ఆశీస్సులు నిరంతరం ఉంటాయని పండితులు చెబుతున్నారు. దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం అని ఈ వృక్షాన్ని కీర్తిస్తారు.

వాస్తు దోషాలకు దివ్యౌషధం

వాస్తు శాస్త్రం ప్రకారం.. పారిజాత మొక్క కేవలం సువాసనలనే కాదు అద్భుతమైన సానుకూల శక్తిని కూడా ఇస్తుంది. దీనిని ఇంటికి ఉత్తర-ఈశాన్య దిశలో లేదా దక్షిణ-నైరుతి దిశలో నాటడం అత్యంత శుభప్రదం.

ఇంటిపై పడే దిష్టి, చేతబడి వంటి ప్రతికూల ప్రభావాలను గ్రహించి, ఇంటిని కాపాడే శక్తి ఈ మొక్కకు ఉందని నమ్ముతారు.

శ్రీకృష్ణుడు భూమికి తెచ్చిన వరం

పారిజాతం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇది నిజానికి ఇంద్రుని నందనవనంలో ఉండేది. శ్రీకృష్ణుడు ఇంద్రుడితో పోరాడి, పారిజాత వృక్షాన్ని భూలోకానికి తీసుకువచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. మరో విశేషమేమిటంటే.. సాధారణంగా పూజకు నేలపైన పడిన పువ్వులను వాడరు. కానీ పారిజాత పుష్పాలు నేలపైన పడినా అవి అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.

ఆరోగ్యానికి మరియు మానసిక ప్రశాంతతకు..

రాత్రిపూట పారిజాత పువ్వులు వెదజల్లే సువాసన మనసులోని ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను ఇస్తుంది.

కేవలం ఆధ్యాత్మికమే కాదు, ఆయుర్వేదంలో కూడా పారిజాత ఆకులు, పూలు అనేక వ్యాధులకు మందుగా వాడతారు.

ఈ మొక్కకు పుష్కలంగా సూర్యరశ్మి అవసరం. కాబట్టి ఎండ తగిలే చోట దీనిని పెంచాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story