వ్రతాన్ని ఎలా చేయాలి?

Observe the 16 Fridays Vratam: ఈ వ్రతాన్ని వరుసగా 16 శుక్రవారాలు చేయాలి. వ్రతం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంటిని, పూజా గదిని శుద్ధి చేయాలి. అమ్మవారి పటం ముందు దీపం వెలిగించాలి. ఓ కలశంపై కొబ్బరికాయ ఉంచాలి. బెల్లం, వేయించిన శనగలను నైవేద్యంగా పెట్టాలి. పూజలో భాగంగా వ్రత కథను చదివి, హారతి ఇవ్వాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం ఓపూట భోజనం చేయవచ్చు. పూజానంతరం ప్రసాదం పంచాలి.

ఇతర దేశానికి వెళ్లిన తన భర్త క్షేమం కోసం, అత్తామామల వేధింపులు భరిస్తున్న ఓ పేద ఇల్లాలు ఈ వ్రతాన్ని ఆచరించింది. భార్య భక్తికి మెచ్చిన మాత తన భర్తకు కలలో కనిపిస్తుంది. తన భార్య పడుతున్న కష్టాలను వివరిస్తుంది. దీంతో వెంటనే అతను అపారమైన సంపదతో ఇంటికి తిరిగి వస్తాడు. దంపతులిద్దరూ కలిసి అమ్మవారికి కృతజ్ఞతగా ఉద్యాపన చేస్తారు. ఈ కథ కష్టాల్లో దైవం ఎలా ఆదుకుంటుందో చెబుతుంది. ఈ కథ విన్నా వ్రతఫలం దక్కుతుందట.

16 శుక్రవారాల వ్రతం పూర్తయ్యే చివరి వారంలో ‘ఉద్యాపన’ చేయాలి. ఆ రోజున 8 మంది బాలురను ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. భోజనంలో పాయసం, పూరీ, బెల్లం, శనగలు వడ్డించాలి. భోజనంలో పులుపు ఉండకూడదు. భోజనం తర్వాత పిల్లలకు అరటిపండు, ప్రసాదం, దక్షిణ ఇవ్వాలి. పిల్లలు ఆ రోజున ఏ విధమైన పులుపు పదార్థాలు తినకుండా జాగ్రత్త వహించాలి. అప్పుడే వ్రతం సంపూర్ణమవుతుంది. అమ్మవారి కృపతో ఆ ఇల్లు సుఖశాంతులతో నిండిపోతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story