Nag Panchami: హిందూ ధర్మంలో ప్రకృతిని, ప్రాణిని దైవంగా భావించడం మన సంప్రదాయం. అందులోనూ నాగదేవతలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. నేడు నాగపంచమి సందర్భంగా, అసలు నవ నాగులు అంటే ఎవరు? వారిని ఎందుకు పూజించాలి? ఈ పూజ వెనుక ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం, మనకు రక్షణగా నిలిచే తొమ్మిది మంది ప్రధాన నాగదేవతలను 'నవ నాగులు' అని పిలుస్తారు. వారు ఎవరంటే... అనంతుడు (ఆదిశేషుడు), వాసుకి, శేషుడు, పద్మనాభుడు, కంబళుడు, శంఖపాలుడు, ధృతరాష్ట్రుడు, తక్షకుడు మరియు కాలియుడు. ఈ తొమ్మిది మందిని పూజించడం వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సంతాన సౌభాగ్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

అసలు నాగపంచమి రోజున ఎందుకు పూజ చేయాలి? అంటే... సర్ప దోషాల నివారణకు, కాలసర్ప దోష శాంతికి, కుటుంబ సౌఖ్యానికి, అలాగే వ్యవసాయ క్షేత్రాల రక్షణ కోసం నాగదేవతలను ఆరాధిస్తారు. నాగదేవతలు భూమికి, జలాలకు మరియు ప్రకృతికి రక్షకులుగా భావించబడతారు. కాబట్టి, నాగులను పూజించడం అంటే మనం ప్రకృతిని గౌరవించడమే.

ఈ పవిత్రమైన రోజున పాలు, పసుపు, కుంకుమ , పువ్వులతో నాగదేవతలను భక్తితో పూజించాలి. 'అనంతో వాసుకిః శేషః పద్మనాభశ్చ కంబలః | శంఖపాలో ధృతరాష్ట్రస్తక్షకః కాలియస్తథా ||' అనే శ్లోకాన్ని స్మరిస్తూ, ఆ నవ నాగ దేవతల అనుగ్రహాన్ని పొందాలని కోరుకుందాం.

PolitEnt Media

PolitEnt Media

Next Story