Normal Rush of Devotees in Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల రద్దీ ప్రస్తుతానికి సాధారణ స్థాయిలో కొనసాగుతోంది. ఈ రోజు (గురువారం, నవంబర్ 6, 2025) వేకువజాము నుంచే భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల బారులు తీరారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వర్గాలు వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉండే భక్తులకు సుమారు 5 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్‌లు దాదాపు నిండిపోయాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ అధికారులు భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. టీటీడీ అధికారులు భక్తులు తమ వంతు వచ్చే వరకు ఓపికగా వేచి ఉండాలని కోరారు. తిరుమలలో చలి వాతావరణం దృష్ట్యా, ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్నప్రసాదం, తాగునీరు వంటి సౌకర్యాలు క్యూలైన్లలో అందుబాటులో ఉన్నాయి. రద్దీలో మార్పులు సంభవించే అవకాశం ఉంది కాబట్టి, భక్తులు టీటీడీ అధికారిక ప్రకటనలు, అప్‌డేట్‌లను గమనించగలరు.

Next Story